కులాల వారీగా కూర్చొని తినండి.. పెళ్లి భోజనాల్లో మైక్​లో ప్రకటన

By

Published : May 16, 2022, 1:10 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

thumbnail

పెళ్లి విందులో కులాల వారీగా కూర్చొని తినాలంటూ లౌడ్​స్పీకర్​లో ప్రకటన చేసిన సంఘటన హిమాచల్​ప్రదేశ్​, సిర్​మౌర్​ జిల్లాలో జరిగింది. కులం ఆధారంగా కూర్చోబెట్టి భోజనం వడ్డించిన వీడియోను ఓ యువకుడు ఫేస్​బుక్​లో పోస్ట్​ చేయటం వల్ల.. వైరల్​గా మారింది. "శిల్లాయీ ప్రాంతంలోని పరిస్థితి ఇది.. కుల వివక్ష, అంటరానితనాన్ని ఏ విధంగా ఆచరిస్తున్నారో చూడండి" అని రాసుకొచ్చాడు అతడు. వీడియోలో.. మైక్​లో కులాల వారీగా భోజనాలు వడ్డింపుపై ఓ వ్యక్తి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. దీనిని తీవ్రంగా ఖండించింది దళిత్​ శోషణ ముక్తి మంచ్​. దర్యాప్తు చేపట్టి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేసింది. పోటా మనాల్​ పంచాయతీలో మే 12న ఈ ఘటన జరిగనట్లు ఈటీవీ భారత్​తో చెప్పాడు వీడియో పోస్ట్​ చేసిన యువకుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్​పీ వీర్​ బహదూర్​ తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.