కాామారెడ్డి బీఆర్​ఎస్​ పార్టీలో వర్గపోరు-జెడ్పీటీసీపై ఎంపీపీ దాడి

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 8:04 PM IST

thumbnail

Disputes in BRS Party in Kamareddy District : కామారెడ్డి జిల్లాలో బీఆర్​ఎస్ వర్గపోరు బయటపడింది. మాచారెడ్డి మండల ఎంపీపీ నర్సింగరావు.. జడ్పీటీసీ రాంరెడ్డిపై దాడి చేశాడు. నర్సింగరావు చేసిన దాడికి నిరసనగా.. జేడ్పీటీసీ స్వగ్రామం​లో ఆందోళనకు దిగారు. చుక్కాపూర్​ గ్రామంలో బీఆర్​ఎస్​ ప్రచార బాధ్యతలను రాంరెడ్డికి అప్పగించగా.. సదరు గ్రామంలో మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ​రావు తన అనుచరులతో కలిసి ప్రచారం చేశారు. తన గ్రామంలో ప్రచారం చేయొద్దని జేడ్పీటీసీ రాంరెడ్డి అభ్యంతరం తెలపడంతో.. ఆగ్రహించిన నర్సింగరావు దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.

Clashes in Kamareddy BRS Party : ఈ దాడిని జెడ్పీటీసీ రాంరెడ్డి అనుచరులు ఖండించారు. దాడిలో గాయపడిన ఆయనను.. కామారెడ్డిలోని ఆయన నివాసంలో వారంతా పరామర్శించారు. అనంతరం ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్​ ఇంటి వద్దకు భారీగా చేరుకుని.. నర్సింగరావుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాయపడిన జెడ్పీటీసీకి.. నర్సింగరావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్​.. పార్టీ నియమాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.