Car Burnt at Kothagudem : సడెన్​గా కారులో మంటలు.. చూస్తుండగానే పూర్తిగా దగ్ధం.. లక్కీగా..

By

Published : Aug 11, 2023, 9:26 PM IST

thumbnail

Car Burnt at Kothagudem : నడిరోడ్డుపై కారు పూర్తిగా దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్టు మండలం కొత్తగూడెం వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్​-విజయవాడ జాతీయ రహదారిపై కారు మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అబ్దుల్లాపూర్​మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్​కు చెందిన జ్ఞాని వంశీధర్​ రెడ్డి కారు(TS 08 HQ1903)ను రెండు రోజుల క్రితం అతని స్నేహితుడైన ధరావత్​ శివాజీ లాంగ్​ డ్రైవ్​ నిమిత్తం విజయవాడకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం నిమిత్తం హైదరాబాద్​ వస్తుండగా అబ్దుల్లాపూర్​మెట్​ సమీపంలోని అన్నమాచార్య ఇంజినీరింగ్​ కాలేజ్​ వద్ద ఇంజిన్​ నుంచి మంటలు రావడంతో.. అప్రమత్తమైన శివాజీ కారును వెంటనే ఆపి అందులో నుంచి దిగిపోయాడు. మంటలు ఎక్కువగా వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.