సంగారెడ్డిలో రూ.3 కోట్ల విలువ గల గంజాయి పట్టివేత

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 5:41 PM IST

thumbnail

Around Rs. 3 crore worth Ganja seized at Sangareddy : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ తేదీ దగ్గర పడుతుండగా పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్​ తెలిపిన వివరాల ప్రకారం. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో రెండు బొలెరో వాహనాలను తనిఖీ చేయగా.. దాదాపు రూ.3 కోట్ల విలువ గల ఎండు గంజాయి లభ్యమైంది. ఒక్కో బాక్సు 9 కిలోలు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వాహనంలో మొత్తం 70 బాక్సుల్లో 635 కిలోల ఎండు గంజాయి ఉందని చెప్పారు. ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్​ను అదుపులో తీసుకున్నట్లు వివరించారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారని తెలిపారు. తమ యజమాని ఆదేశాల మేరకు ఒడిశాలోని జన్​ భాయ్​ ఏజెన్సీ ప్రాంతంలో ఉండే త్రినాథ్​ నుంచి గంజాయిని కొనుగోలు చేసి.. తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.