వారణాసిలో గంగా హారతి - మధురైలో హోమాలు - రోహిత్​ సేన గెలుపు కోసం దేశవ్యాప్తంగా పూజలు

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 10:59 AM IST

thumbnail

World Cup Semi Finals 2023 : ఈ ఏడాది ప్రపంచకప్​ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు లీగ్​ దశ జరగ్గా.. ఇక నుంచి అసలు పోరు మొదలవ్వనుంది. ఇందులో భాగంగా ఎంపికైన నాలుగు జట్లు సెమీస్​లో ఆడనున్నాయి. ఈ క్రమంలో ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా భారత్​ న్యూజిలాండ్​ మధ్య తొలి సెమీస్​ జరగనుంది. దీంతో మన జట్టు గెలవాలని క్రికెట్​ లవర్స్​ ఆకాంక్షిస్తున్నారు. దేశమంతట ఉన్న అభిమానులు వివిధ రకాలుగా తమ అభిమానాన్ని తెలుపుతున్నారు. పూజలు, నినాదాలతో రోహిత్​ సేనకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే ముంబయిలోని వాంఖడే వేదికకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. ప్లకార్డులు, వరల్డ్​ కప్​ నమూనా, పోస్టర్లను చేతపట్టుకుని ఇండియా గెలుస్తుందంటూ నినాదాలు చేస్తున్నారు.

మరి కొందరైతే పూజలు చేస్తూ సెమీస్​లో భారత జట్టు గెలవాలని ప్రార్థిస్తున్నారు. మధురైలోని జల్లి కట్టు రోటరీ క్లబ్​కు చెందిన క్రికెట్​ లవర్స్.. ఆ క్లబ్​ వేదికగా ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. దేవుడి ముందు వరల్డ్​ కప్​ జట్టులో ఉన్న ప్లేయర్ల ఫొటోలు ఉంచి పూజలు చేశారు.

ఇక వారణాసిలోని కొందరు అభిమానులు ఘాట్స్​ వద్దకు వచ్చి గంగా దేవికి హారతి ఇచ్చారు. క్రికెట్​ బ్యాట్​లతో పాటు జాతీయ జెండాలు పట్టుకుని టీమ్ఇండియా గెలవాలంటూ మద్దతు పలికారు.

మరోవైపు ఒడిశాలోని సైకత శిల్పి సుదర్శన్​ కూడా తనదైన శైలిలో అభిమానాన్ని చాటారు. పూరీ బీచ్​ ఒడ్డున  ఓ భారీ బ్యాట్​ రూపొంలో ఉన్న సైకత శిల్పాన్ని రూపొందిచారు. టీమ్ఇండియాకు ఆల్​ ద బెస్ట్​ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.