సీఎంకు చేదు అనుభవం.. ఉల్లితో ప్రజలు దాడి

By

Published : Nov 3, 2020, 5:04 PM IST

thumbnail

బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​కు చేదు అనుభవం ఎదురైంది. మూడోదఫా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. హర్లఖి మధుబానిలో ఏర్పాటు చేసిన ఓ ర్యాలీలో నితీశ్​పై కొందరు దుండగులు ఉల్లిపాయలు, రాళ్లను విసిరారు. నితీశ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ ఘటనలో నితీశ్​కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది నితీశ్​కు భద్రత కల్పించారు. ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని నితీశ్​ అన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.