నేపాల్ విమానం క్రాష్.. ఫేస్​బుక్​లో లైవ్ ఇచ్చిన భారత ప్రయాణికుడు

By

Published : Jan 16, 2023, 10:32 AM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

నేపాల్ విమాన ప్రమాదానికి సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. ప్రమాదానికి ముందు ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​కు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫేస్​బుక్​ లైవ్ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. గాజియాబాద్​కు చెందిన నలుగురు వ్యక్తులు ఈ విమానంలో ప్రయాణించారని అధికారులు తెలిపారు. వీరంతా ఘటనలో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మృతుల బంధువులతో టచ్​లో ఉన్నట్లు వెల్లడించారు. మృతదేహాలను భారత్​కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు స్పష్టం చేశారు. మృతుల్లో సోనూ జైశ్వాల్, అభిషేక్ కుష్వాహా, అనిల్ కుమార్ రాజ్​భర్, విశాల్ శర్మ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా గాజీపుర్​లోని కాసిమాబాద్​కు చెందినవారని చెప్పారు. అయితే, ప్రమాదానికి ముందు సోనూ జైశ్వాల్ విమానంలో నుంచి ఫేస్​బుక్​ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు. విమానం బయటి దృశ్యాలు, లోపల ఉన్న ప్రయాణికులు వీడియోలో కనిపిస్తున్నారు. ఒక్కసారిగా విమానం కుప్పకూలడం, ప్రయాణికుల ఆర్తనాదాలు, భారీగా మంటలు చెలరేగడం అందులో రికార్డైంది. జనవరి 13న వీరంతా నేపాల్ టూర్​కు వెళ్లారని స్థానికులు తెలిపారు. 

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.