మహిషాసుర మర్దిని నృత్య వర్ధిని

By

Published : Dec 18, 2022, 11:43 AM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

thumbnail

Mahishasura Mardini group dance at Shilparam: హైదరాబాద్‌ శివారు ఉప్పల్‌లోని శిల్పారామం శనివారం రాత్రి 777 మంది అమ్మాయిల సామూహిక నృత్య ప్రదర్శనకు వేదికైంది. ఇంటర్నేషనల్‌ కర్నాటిక్‌ మ్యుజీషియన్స్‌ అండ్‌ డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘మహిషాసుర మర్దిని’ స్తోత్రానికి అనుగుణంగా 5-75 ఏళ్లలోపు బాలికలు, మహిళలు సామూహిక నృత్యాన్ని ప్రదర్శించారు. ఇలా ప్రత్యక్షంగానే కాకుండా ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా 9 రకాల నృత్య రీతులతో అనేకమంది కళాకారులు అలరించారు. పది ప్రపంచ రికార్డుల కోసం దీనిని నిర్వహించామని విశ్వ వ్యాప్తంగా సుమారు 7వేల మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారని అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఉమామహేశ్వరి తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.