ETV Bharat / state

NRI Donation for Yadadri Temple : యాదాద్రి గోపురం బంగారు తాపడానికి ఎన్​ఆర్​ఐ భారీ విరాళం

author img

By

Published : Jan 1, 2022, 8:22 AM IST

NRI Donation for Yadadri Temple : యాదాద్రి లక్ష్మీనరసింహ దేవాలయ విమాన గోపురం బంగారు తాపడానికి భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నగదు రూపంలో.. మరికొందరు బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు. తాజాగా ప్రవాస భారతీయుడు(ఎన్​ఆర్​ఐ) పైళ్ల మల్లారెడ్డి బంగారు తాపడానికి కిలో పసిడిని విరాళంగా సమర్పించారు. దీనికి సంబంధించి రూ.50 లక్షల చెక్కును రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డికి అందించారు.

NRI Donation for Yadadri Temple
NRI Donation for Yadadri Temple

NRI Donation for Yadadri Temple : యాదాద్రి దేవాలయ విమాన గోపురం బంగారు తాపడానికి ప్రవాస భారతీయుడు(ఎన్‌ఆర్‌ఐ) పైళ్ల మల్లారెడ్డి కిలో బంగారాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి బంగారం కోసం రూ.50 లక్షల చెక్కును అందజేశారు. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మల్లారెడ్డి కరోనా సమయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.కోటి, మిషన్‌ కాకతీయకు రూ.50 లక్షల విరాళం అందజేశారని, తన సొంత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా సుంకిశాలలో కళాశాల భవనం, ఆలయాలు నిర్మించారని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

98 రోజులు.. రూ.10.26 కోట్లు

Yadadri Temple Donations : యాదాద్రి ఆలయ విమాన గోపురాన్ని బంగారు కవచాలతో తీర్చిదిద్దేందుకు భక్తుల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో గత 98 రోజుల నుంచి ఇప్పటి వరకు నగదు, చెక్కులు, డీడీలు, ఆన్‌లైన్‌ రూపంలో రూ.10,26,72,796 సమకూరాయని ఆలయ ఈవో గీత శుక్రవారం ప్రకటించారు. అలాగే నేరుగా 2.360 కిలోల బంగారం విరాళాల రూపంలో వచ్చిందని ఈవో వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.