ETV Bharat / state

భద్రకాళి ఆలయంలో మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి

author img

By

Published : Dec 17, 2020, 8:31 PM IST

minister errabelli dayakar rao at bhadrakali temple in warangal urban district
భద్రాకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ భద్రకాళి అమ్మవారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఎంపీ సంతోష్ కుమార్​తో కలిసి ఆయన మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

వరంగల్ భద్రకాళి అమ్మవారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఎంపీ సంతోశ్ కుమార్​తో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ ప్రాంగణంలో మంత్రి దయాకర్​ రావుతో పాటు ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు కలిసి మొక్కలను నాటారు. అర్చకులు ఆలయానికి వచ్చిన ప్రజా ప్రతినిధులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శేష వస్త్రాలను అందజేశారు.

ఇదీ చదవండి: నా మాటలు వక్రీకరించి... దుష్ప్రచారం చేస్తున్నారు: శ్రీనివాస్ గౌడ్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.