ETV Bharat / state

మనసు మార్చుకున్న దొంగలు.. లూటీ చేసిన సొమ్ము.. వాకిట్లో ప్రత్యక్షం

author img

By

Published : Mar 30, 2023, 6:05 PM IST

gold
gold

Strange theft in Bollikunta, Warangal district: టెక్నాలజీ పుణ్యామా అనీ ఈ రోజుల్లో ఏదీ దాగడం లేదు. ఎంత పెద్ద చోరీ జరిగినా.. క్షణాల్లో దొంగలు దొరికిపోతున్నారు. తాము కూడా అవిధంగానే దొరికిపోతామెమోనని భయపడిన దొంగలు దొచుకెళ్లిన సొమ్మును.. లూటీ చేసిన ఇంటి ఆవరణలో వేశారు ఈ ఘటన వరంగల్​ జిల్లా బొల్లికుంటలో జరిగింది.

Strange theft in Bollikunta, Warangal district: పక్కా పథకంతో బంగారు ఆభరణాలను చోరీ చేశారు.. వారం తర్వాత ఎందుకో దొంగలు మనసు మార్చుకున్నారు. పోలీసులు దొరికిపోతామెమోనన్న భయమో.. లేక మరేదో కానీ దొంగలించిన మొత్తంలోంచి కొంత బంగారంను తీసుకుని మిగతాదంతా బాధితుల ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయారు.

ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలో వారం రోజుల క్రితం చోరీ జరిగింది. 30 తులాల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో డాగ్ స్క్వాడ్ సహాయంతో చోరీ జరిగిన పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వేలిముద్రలను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈలోపు అనూహ్యంగా పోయిన బంగారం దొరికింది.

దొంగలు బాధితుల ఇంటి ప్రహరీ గోడ వద్ద బంగారం విడిచిపెట్టి వెళ్లిపోయారు. పోయిన బంగారం దొరికిందని బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసు శాఖ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కానీ 30 తులాల బంగారం చోరీకి గురైతే.. వచ్చింది మాత్రం 27 తులాలే ఉన్నాయని బాధితులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుని మిగిలిన 3 తులాల బంగారాన్ని ఇప్పించాలని వేడుకుంటున్నారు.

అదును చూసి దొంగతనం..

వరంగల్​ జిల్లా ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలో గొలికార్ గోపి తన ముగ్గురు అన్నదమ్ములతో కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే యాదగిరి గుట్టలో తమ దగ్గరి బంధువుల పదోరోజు కార్యక్రమానికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు శుక్రవారం రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడ్డారు. మొదట ఇంటిపై కప్పు తొలగించేందుకు యత్నించారు. ఆ తరువాత ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలోని 30 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.

"వారం రోజుల క్రితం మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ చోరీలో దొంగలు బీరువాలో ఉన్న 30 తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాము. క్రైమ్​ బ్రాంచ్​ వారు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. డాగ్​ స్క్వాడ్​తో పరిసరాలను పరిశీలించారు. వేలిముద్రలను సేకరించారు. మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది. దొచుకెళ్లిన బంగారంను దొంగలను ఇంటి అవరణలో వేశారు. లూటీ చేసిన సొమ్ములో 3తులాల బంగారం తక్కువగా ఉంది. పోలీసులు దొంగలను పట్టుకుని మిగిలిన మూడు తులాలను రికవరీ చేయగలరు".- బాధితులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.