ETV Bharat / state

మిరుదొడ్డిలో నిరాడంబరంగా గణేశ్ నిమజ్జనం

author img

By

Published : Aug 31, 2020, 7:55 AM IST

Ganesh Navratri festivities that ended modestly in Miruddi
మిరుదొడ్డిలో నిరాడంబరంగా ముగిసిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు

కరోనా వైరస్​ వల్ల ఈసారి వినాయక నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా ముగిశాయి. పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులు హాజరై.. బొజ్జ గణపయ్యలను నిమజ్జనం చేశారు.

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో శోభాయాత్రను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పురవీధుల గుండా శోభాయాత్ర కొనసాగించారు.

స్థానిక గాంధీ చౌక్ వద్ద లడ్డూ వేలం వేశారు. అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో వినాయకులను నిమజ్జనం చేశారు. పరిమిత సంఖ్యలో గ్రామ పెద్దలు, యువత నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవీచూడండి: జనాభా లెక్కలు ఈ ఏడాది లేనట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.