ETV Bharat / state

నిరాడంబరంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

author img

By

Published : Sep 18, 2020, 10:53 AM IST

engili pula bathukamma celebrations at thoguta mandal in siddipet district
నిరాడంబరంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక

పితృఅమావాస్య కావడం వల్ల మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. తోగుట మండలంలోని పలు గ్రామాల్లో కరోనా వైరస్ నేపథ్యంలో ఈ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.

సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని పలు గ్రామాల్లో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మను జరుపుకున్నారు. అయితే ఈ సారి కరోనా వైరస్ ప్రభావం, మరోవైపు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధికమాసం కావడం వల్ల ఆడపడుచులు అక్కడక్కడా ఎంగిలిపూల బతుకమ్మను పేర్చారు.

అధికమాసం దృష్టా గ్రామాల్లో ఈ ఏడాది మొదటి రోజు బతుకమ్మ పండుగ వాతావరణం ఎక్కడ కనిపించలేదు. పెద్దల అమావాస్య రోజే అధికమాసం కావడం వల్ల ఈరోజు ఒక్కరోజే బతుకమ్మ చేయాలని, తిరిగి అక్టోబరు వచ్చే అమావాస్య రోజు నుంచి పండుగ తిరిగి ప్రారంభమవుతుందని పురోహితులు తెలిపారు.

ఇదీ చూడండి: ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు... తీరొక్క పూలు పేర్చి ఆట పాటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.