ETV Bharat / state

కర్ణంగూడ కాల్పుల కేసులో నలుగురు అరెస్ట్​.. హత్యలు చేసింది వారేనా?

author img

By

Published : Mar 3, 2022, 9:52 AM IST

Updated : Mar 3, 2022, 2:24 PM IST

Telangana Realtors Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన కర్ణంగూడ కాల్పుల ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణంగూడ భూమి విషయంలో మట్టారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కర్ణంగూడ కాల్పుల ఘటనపై ముమ్మర దర్యాప్తు.. పలు కోణాల్లో విచారణ
కర్ణంగూడ కాల్పుల ఘటనపై ముమ్మర దర్యాప్తు.. పలు కోణాల్లో విచారణ

Telangana Realtors Murder Case: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కర్ణంగూడ కాల్పుల ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివాదాస్పద స్థలం పక్కనే ఉన్న భూ యజమాని మట్టారెడ్డితో పాటు నవీన్, హఫీజ్, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణంగూడ భూమి విషయంలో మట్టారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన హత్యకు శ్రీనివాస్ రెడ్డి కుట్రపన్నినట్లు తెలుసుకున్న మట్టారెడ్డి.. తన అనుచరులతో కలిసి హత్యకు ప్రణాళికలు రచించినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ సాయంత్రం వివరించనున్నారు.

మంగళవారం ఉదయం ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఘటనాస్థలంలోనే స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్​ రెడ్డి చనిపోగా.... చికిత్స పొందుతూ రాఘవేందర్​ రెడ్డి మృతిచెందారు. తమపై కాల్పులు జరిపింది ఎవరో తెలియదని చెప్పిన రాఘవేందర్ రెడ్డి.. అంతలోనే పరిస్థితి విషమించటంతో ప్రాణాలు విడిచారు. కాల్పుల గురించి తెలుసుకునే లోపే ఆయన చనిపోవటంతో కేసు విచారణ పోలీసులకు సవాల్​గా మారింది. దీంతో సాంకేతిక ఆధారాలపైనే దృష్టి సారించిన పోలీసులు... మృతుల కాల్​డేటా, సెల్​ఫోన్​ సిగ్నళ్ల ఆధారంగా విచారణ సాగిస్తున్నారు.

వివాదాస్పద భూముల సెటిల్మెంట్​లోను చేయి

శ్రీనివాస్​ రెడ్డి వివాదాస్పద భూములు సెటిల్​ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని నెలలుగా సెటిల్​మెంట్​ చేసిన భూములు, ఫ్లాట్ల వివరాలను సేకరించారు. కాల్పులకు కర్ణంగూడ వివాదాస్పద భూమి కారణమని భావిస్తున్న పోలీసులు.. ఆ దిశగా విచారణ చేపట్టారు. మరోవైపు కాల్పులకు పాత కక్షలు కారణమై ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు.. ఇటీవల శ్రీనివాస్​ రెడ్డి చేసిన సెటిల్​మెంట్​ వివరాలను సేకరిస్తున్నారు. కిరాయి హంతకులు కాల్పులు జరిపినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. సాంకేతిక, ఇతర ఆధారాలు క్రోడీకరించి విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్​ రెడ్డి డ్రైవర్​ కృష్ణ, హఫీజ్​ల పేరు మీద పలు ఆస్తులను.. ఆయన రిజిస్ట్రేషన్​ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ శ్రీనివాస్ రెడ్డికి బినామీలుగా వ్యవహరిస్తున్నట్లు తేల్చారు. కృష్ణ, హఫీజ్​లతో పాటు పక్క పొలానికి చెందిన మట్టారెడ్డి, ఇతర అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:

Last Updated :Mar 3, 2022, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.