ETV Bharat / state

Bandlaguda car accident : బర్త్​డే మూడ్.. లైసెన్స్ లేకున్నా డ్రైవింగ్.. చివరకు ఆ కుటుంబంలో విషాదం

author img

By

Published : Jul 4, 2023, 10:31 PM IST

Updated : Jul 4, 2023, 10:47 PM IST

Bandlaguda car accident
Bandlaguda car accident

Bandlaguda car accident news : పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు జైలు పాలయ్యాడు. స్నేహితులతో కలిసి కారును వేగంగా నడుపుతూ ప్రమాదం చేశాడు. రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వాళ్లను ఢీకొట్టి ఇద్దరు చావుకి కారణమయ్యాడు. మృతుల్లో తల్లి, కుమార్తె ఉండగా.. తీవ్ర గాయాలతో మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం రంగారెడ్డి జిల్లా బండ్లగూడ సమీపంలో జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Mother and daughter died in a car accident At Bandlaguda : ఉదయం నడకకు వెళ్లిన ఆ తల్లి, కుమార్తెను మృత్యువు వెంటాడింది. కారు రూపంలో వచ్చి ఇద్దరినీ బలి తీసుకుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హైదర్ షా కోట్‌లోని లక్ష్మి నరసింహా కాలనీలో ఉండే అనురాధ, ఆమె కుమార్తె మమత రోజులానే.. ఈ రోజు ఉదయం కూడా మార్నింగ్‌ వాకింగ్‌కు వెళ్లారు. ఉదయం 6 గంటల సమయంలో వెళ్లగా.. అదే కాలనీలో నివాసం ఉంటున్న కవిత అనే మరో మహిళ కూడా వీరిద్దరితో వాకింగ్‌కు వెళ్లింది.

ముగ్గురు కలిసి ప్రధాన రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. కాస్త దూరం వెళ్లగానే మృత్యువు కారు రూపంలో వీరిపై దూసుకొచ్చింది. వెనుక నుంచి కారు వీరిని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాల్లో లేసి రహదారి పక్కకు ఎగిరి పడ్డారు. కారు అదే వేగంతో వెళ్లి.. ఇంతియాజ్ అనే మరో వ్యక్తిని ఢీకొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. కారు ప్రమాదంలో తల్లి అనురాధ, కుమార్తె మమత సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కవిత తీవ్రగాయాల పాలవడంతో నానల్‌నగర్‌లో ఉన్న ఆలివ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

బర్త్​డే మూడ్.. లైసెన్స్ లేకున్నా డ్రైవింగ్.. చివరకు ఆ కుటుంబంలో విషాదం

ఒంటరి వాడైన కుమారుడు: ఇంతియాజ్ కాలు విరగడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇద్దరినీ అత్యవసర చికిత్స విభాగంలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అనురాధ రెండేళ్ల క్రితం లక్ష్మీ నరసింహ కాలనీలోని పద్మనాభరెడ్డి ఇంట్లో కుమార్తె, కుమారుడితో కలిసి అద్దెకు ఉంటోంది. కుమారుడు సాయి కిరణ్ గోల్కొండ మున్సిపాలిటీ ఆఫీస్‌లో పొరుగుసేవల విభాగంలో పనిచేస్తున్నాడు. కుమార్తె మమత ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. తల్లి సోదరి చనిపోవడంతో సాయికిరణ్ ఒంటరి వాడయ్యాడు. ప్రమాదంలో గాయపడిన కవిత తన ముగ్గురు కుమార్తెలతో కలిసి అదే కాలనీలో ఉంటుంది.

Car accident at Narsingh : పెద్ద కుమార్తె ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది. మిగతా ఇద్దరు కుమార్తెలు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుతున్నారు. ప్రస్తుతం ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ముగ్గురు కుమార్తెలు ఆందోళన చెందుతున్నారు. మాసబ్ ట్యాంక్‌కు చెందిన బద్రుద్దీన్ అవినాష్ డిగ్రీ కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ రోజు తన పుట్టిన రోజు కావడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి.. మెయినాబాద్ బయల్దేరారు. స్నేహితుడు రహీం కారు తీసుకురావడంతో నలుగురు అందులో పయనమయ్యారు. బద్రుద్దీన్ కారు నడుపగా మిగతా ముగ్గురు సీట్లల్లో కూర్చున్నారు.

జైలు పాలైన విద్యార్థి: మాసబ్ ట్యాంకులోని ఇంటి నుంచి బయల్దేరిన తర్వాత బండ్లగూడ మీదుగా మెయినాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో సన్ సిటీ మలుపు వద్ద కారు అదుపు తప్పింది. ప్రమాదంలో కారులో ఉన్న యువకులకు స్వల్ప గాయలయ్యాయి. కారు ప్రమాదంలో ఇద్దరి మృతికి కారణమైనందుకు బద్రుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారును నడిపినందుకు అతనిపై అదనపు సెక్షన్లు నమోదు చేశారు. అనురాధ, మమతల మృతదేహాలకు ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.

ప్రమాదానికి కారణమైన యువకుడు
ప్రమాదానికి కారణమైన యువకుడు

ఇవీ చదవండి:

Nagpur Car Accident Today : బ్రిడ్జి పైనుంచి రైల్వేట్రాక్​పై పడిన కారు.. తెలుగు వారికి గాయాలు

Bus accident in Sultanabad : ఆటో తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా.. 40 మందికి గాయాలు

boy died falling under the tractor in karimnagar : కుక్క నుంచి తప్పించుకోబోయి ట్రాక్టర్ కింద పడిపోయాడు..

Last Updated :Jul 4, 2023, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.