ETV Bharat / state

రైతు వేదిక నిర్మాణానికి కేటీఆర్, నిరంజన్ రెడ్డి శంకుస్థాపన

author img

By

Published : May 26, 2020, 7:17 PM IST

Updated : May 26, 2020, 9:06 PM IST

రైతు భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రులు
రైతు భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, కేటీఆర్​లు పర్యటించారు. ముస్తాబాద్‌లో రైతు వేదిక నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం రాచర్ల గొల్లపల్లిలో వ్యవసాయ గోదాంకు శంకుస్థాపన చేశారు. రాచర్ల బొప్పాపూర్‌లో మార్కెట్‌ కమిటీ పరిపాలన భవనాన్ని ప్రారంభించారు. తర్వాత రైతు భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

రైతు వేదిక నిర్మాణానికి కేటీఆర్, నిరంజన్ రెడ్డి శంకుస్థాపన

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. రాచర్ల బొప్పాపూర్‌లో నియంత్రిత సాగు విధానంపై స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతు బంధు సమితి సభ్యులు, పాక్స్ ఛైర్మన్​లు, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రులు పాల్గొన్నారు.

సిరిసిల్లను గోదారమ్మతో అభిషేకిస్తాం !

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9,10,11,12 లను పూర్తి చేసి అక్టోబర్​లోగా రాజన్న సిరిసిల్ల జిల్లాను గోదావరి జలాలతో అభిషేకిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. గోదారమ్మను 500 మీటర్ల ఎత్తుకు తీసుకువచ్చి రైతుల భీడు భూములను సస్యశ్యామలం చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినప్పుడు మొదట విమర్శిస్తారని... మనమంతా సంఘటితమైతే విజయం సాధిస్తామని మంత్రి చెప్పారు.

ఇబ్బందులున్నా అధిగమిస్తున్నాం...

కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ... ఇబ్బందులను అధిగమిస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 90 శాతం రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటకు రైతుబంధు కింద ఏడు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

రుణమాఫీకి సంబంధించి 5 లక్షల 50 వేల మంది రైతులకు 1200 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, సాగునీరు రైతులకు అందిస్తుందన్నారు.

ఇవీ చూడండి : 'నచ్చిన పంట సాగు చేసుకునే స్వేచ్ఛ రైతులకు లేదా?'

Last Updated :May 26, 2020, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.