రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం రైతు రుణ మాఫీని వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలు అక్రమ వసూళ్లను వెంటనే నిలిపివేయాలని కోరుతూ నిరసన తెలిపారు. రైతు వ్యతిరేక విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: గూగుల్ ప్లే స్టోర్లో సాహో వీడియో గేమ్