ETV Bharat / state

నామినేషన్​కు ముందు జిల్లా నేతలతో కవిత భేటీ

author img

By

Published : Mar 18, 2020, 9:30 AM IST

Updated : Mar 18, 2020, 11:53 AM IST

kavitha
kavitha

నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉపఎన్నికకు కవిత ఇవాళ మధ్యాహ్నం నామినేషన్​ వేయనున్నారు. నామపత్రాలు దాఖలు చేసే ముందు స్పీకర్ పోచారం శ్రీనివాస్​ రెడ్డి నివాసంలో నిజామాబాద్​ జిల్లా నేతలతో సమావేశమయ్యారు.

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత ఇవాళ మధ్యాహ్నం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించారు.

నామపత్రాలు దాఖలు చేసే ముందు నిజామాబాద్‌ జిల్లా నేతలతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో జిల్లాకే చెందిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

మరోవైపు కవితకు ఎంపీ సంతోష్​ శుభాకాంక్షలు తెలిపారు. ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెస్తారంటూ ట్వీట్ చేశారు.

kavitha
నామినేషన్​కు ముందు జిల్లా నేతలతో కవిత భేటీ

ఇదీ చూడండి: నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత

Last Updated :Mar 18, 2020, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.