ETV Bharat / state

శ్రీరాంసాగర్​కు కొనసాగుతోన్న వరద ప్రవాహం

author img

By

Published : Aug 21, 2020, 9:19 AM IST

ఎగువ కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా వస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం సుమారు 1086 అడుగులకు చేరుకుంది.

flood flows to the Sriram Sagar project at nizamabad
శ్రీరాంసాగర్​కు కొనసాగుతోన్న వరద ప్రవాహం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఇన్​ఫ్లో 89,656 క్యూసెక్కుల ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుతం నీటిమట్టం సుమారు 1086 అడుగులు ఉంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

జలాశయం నిండుకుండలా మారడం వల్ల పర్యటకుల సందడి నెలకొంది. కరోనా దృష్ట్యా పైకి అనుమతి లేదని.. పర్యటకులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: శ్రీశైలం భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో అగ్నిపమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.