ETV Bharat / state

'రాజగోపాల్​రెడ్డి స్వార్థం వల్లే మునుగోడు ఉపఎన్నిక'

author img

By

Published : Oct 27, 2022, 10:44 PM IST

Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్​ నాయకత్వంలో గ్రామాలు సమగ్ర అభివృద్ధి సాధించాయని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. ఎల్బీనగర్​లోని పుల్లారెడ్డి గార్డెన్​లో హైదరాబాద్​లో ఉంటున్న మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. రాజగోపాల్​రెడ్డి స్వార్థం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని ఆరోపించారు.

కేసీఆర్​ నాయకత్వంలో గ్రామాలు సమగ్ర అభివృద్ధి సాధించాయని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. ఎల్బీనగర్​లోని పుల్లారెడ్డి గార్డెన్​లో హైదరాబాద్​లో ఉంటున్న మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. రాజగోపాల్​రెడ్డి స్వార్థం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం రాజగోపాల్​రెడ్డి రాజీనామా చేసి మునుగోడుకు ఉపఎన్నిక తీసుకొచ్చారని విమర్శించారు.

ఇదే విషయం రాజగోపాల్​రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారన్న తలసాని.. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తెరాస ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. మునుగోడు అభివృద్ధికి ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.

"మునుగోడులో రాజగోపాల్​రెడ్డి స్వార్థం వల్ల ఇప్పుడు ఉపఎన్నిక వచ్చింది. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకున్నట్టు రాజగోపాల్​రెడ్డే స్వయంగా ఓ టీవీ కార్యక్రమంలో ఒప్పుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. రాష్ట్రంలో రఘునందన్​, ఈటల రాజేందర్​ను అక్కడ గెలిపించారు. ఇంత వరకు ఏం సాధించారు. ఆయా నియోజకవర్గాలను ఏం అభివృద్ధి చేశారు. మునుగోడు అభివృద్ధి తెరాసతోనే సాధ్యం.. మీరందరూ కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డిని గెలిపించాలని విజ్ఢప్తి చేస్తున్నా." - తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మంత్రి

'రాజగోపాలరెడ్డి స్వార్థం వలన ఈరోజు మునుగోడుకి ఉపఎన్నిక వచ్చింది'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.