ETV Bharat / state

తృటిలో తప్పిన ప్రమాదం...ప్రయాణికులు సురక్షితం

author img

By

Published : Nov 26, 2020, 6:51 PM IST

Bus turn into road side at nagarjunasagar in nalgonda district
తృటిలో తప్పిన ప్రమాదం...ప్రయాణికులు సురక్షితం

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​ రోడ్డులో దెయ్యాల గండి వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు లోయ పక్కకు ఒరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ల సహాయంతో బస్సును బయటకు తీశారు.

నల్గొండ జిల్లాలో తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. దిల్​సుఖ్​నగర్ నుంచి మార్కాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు నాగార్జునసాగర్ దెయ్యాల గండి వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలోకి ఒరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 37 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ల సహాయంతో బస్సును బయటకు లాగారు. రహదారిపై లారీ, కారు డ్రైవర్ల గొడవే ప్రమాదానికి కారణమని తెలిసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి:'ఎన్టీఆర్, పీవీపై భాజపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.