ETV Bharat / state

నిర్లక్ష్యంగా ఉంటే దిల్లీకి రావాల్సి ఉంటుంది.. ఖదీర్ ఖాన్ కేసులో మైనార్టీ కమిషన్‌ వార్నింగ్

author img

By

Published : Feb 27, 2023, 5:53 PM IST

Syed Shahezadi visited Qadir Khan's family
ఖదీర్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన సయ్యద్ షాహేజాది

Syed Shahezadi visited Qadir Khan family: పోలీసులు కొట్టడంతో మృతి చెందిన ఖదీర్​ఖాన్​ కుటుంబాన్ని జాతీయ మైనార్టీ సభ్యురాలు సయ్యద్​ షాహజాది పరామర్శించారు. అతని కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మైనార్టీ కమిషన్​ పోరాడుతుందని భరోసా ఇచ్చారు.

Syed Shahezadi visited Qadir Khan family: విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లి కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఖదీర్‌ఖాన్‌ కుటుంబానికి అండగా ఉంటామని జాతీయ మైనార్టీ కమిషన్‌ సభ్యురాలు సయ్యద్‌ షాహజాదీ హామీ ఇచ్చారు. మెదక్‌లోని ఖాదీర్‌ ఖాన్‌ కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షితో కలిసి ఆమె పరామర్శించారు. ఖదీర్​ ఖాన్​ మృతి చాలా బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కమిషన్ అండగా ఉంటుందని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.

అసలేం జరిగిందంటే..: మెదక్​కు చెందిన ఖదీర్‌ఖాన్‌ అనే వ్యక్తిపై దొంగ అనే అనుమానంతో పోలీసులు తమ అధికారాన్ని ప్రదర్శించారు. పోలీస్​ స్టేషన్​లో నాలుగు రోజుల పాటు దారుణంగా కొట్టారు. అనంతరం నిందితుడు ఆయన కాదని తెలిసి వదిలేశారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న భర్తను ఆసుపత్రికి తీసుకెెళ్లేందుకు భార్య ప్రయత్నించింది. పోలీసులు వారి చేసిన తప్పును ఎవరికి తెలియకుండా ఉండాలని ఇంట్లోనే ఉంచాలని పోలీసులు ఆమెను బెదిరించారు.

తామే మందులు తెచ్చిస్తాం.. దెబ్బలు తగ్గిపోతాయని చెప్పారు. ఖదీర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 16న మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కలిసి వేడుకున్నారు. ఆయనకు భార్య సిద్దేశ్వరి, ముగ్గురు పిల్లలున్నారు.

"ఖదీర్​ ఖాన్​ మృతి చాలా బాధాకరం. ఈ విషయంలో ఎస్పీ, జిల్లా కలెక్టర్​ చర్యలు చేపడుతున్నారు. విచారణ అవుతుండగా వారిపై ఆరోపణలు చేయను. ఖదీర్​ ఖాన్ కుటుంబం న్యాయం జరిగేంత వరకు కమిషన్​ బలంగా నిలబడతాదని హామీ ఇస్తున్నాను. ఈ విషయంలో ప్రభుత్వం త్వరగా స్పందించాలని కోరుతున్నాను. మనందరం ఏమీ ఇచ్చిన, ఎంత చేసినా ఆమె భర్తను తిరిగి తీసుకురాలేం. అందుకే వారి కుటుంబానికి రూ.50లక్షలు డిపాజిట్​ చేయాలి. డబుల్ బెడ్​రూం ఇవ్వాలి. ఖదీర్​ ఖాన్​ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్వవహరిస్తే కమిషన్ తీవ్రంగా ​చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించిన అధికారులు, కలెక్టర్, ఎస్పీ బాధ్యత వహించాల్సి వస్తుంది. వీళ్లందరూ దిల్లీకి రావాల్సి వస్తది. బాధితులకు అంతిమంగా న్యాయం జరగాలి." - సయ్యద్ షాహేజాది, జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.