ETV Bharat / state

గుండెపోటుతో కుమారుడు, తట్టుకోలేక తల్లి - గంట వ్యవధిలో కుటుంబంలో తీరని విషాదం

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2024, 1:19 PM IST

Updated : Jan 6, 2024, 2:19 PM IST

Son and Mother Died in Medak : మెదక్​ జిల్లాలో కుమారుడు గుండె పోటుతో మృతి చెందాడనే విషయాన్ని భరించలేని ఓ తల్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను వైద్యులు పరిశీలించి మరణించినట్లు ధ్రువీకరించారు. గంట వ్యవధిలోనే తల్లీకుమారుడు మరణించడంతో బాధిత కుటుంబం, గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మరోవైపు ఓ ప్రయాణికుడు రైల్వే స్టేషన్​లోనే హార్ట్​ ఎటాక్​తో మరణించాడు.

Person died Heart Attack at Railway Station
Son and Mother Died in Medak

Son and Mother Died in Medak : చిన్నప్పటి నుంచి కల్ల ముందే పెరిగి పెద్దయిన కుమారుడు ఒక్కసారిగా గుండె పోటుతో చనిపోయాడనే వార్త విన్న ఆ తల్లి తట్టుకోలేకపోయింది. వెంటనే కుమారుడ్ని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లి, తన కుమారుడి మృతదేహాన్ని చూసింది. ఆ బాధను జీర్ణించుకోలేక ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. చివరికు ఆమె కూడా మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తల్లీకుమారుడు ఇద్దరూ చనిపోవడంతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన మెదక్​ జిల్లాలో జరిగింది.

సడెన్​గా గుండె ఎందుకు ఆగిపోతుంది? హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా హవేలీ ఘన్​పూర్​ మండల పరిధిలోని కూచన్​పల్లి గ్రామానికి చెందిన వీరప్ప నర్సింహగౌడ్ (36) ఇంట్లో పడుకున్న సమయంలో తెల్లవారుజామున గుండె పోటు వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. కుమారుడు ఆస్పత్రిలో ఉన్నాడని తెలుసుకున్న తల్లి లక్ష్మి (53) హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లింది. అనంతరం కుమారుడి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

హార్ట్ ఎటాక్ వస్తే సీపీఆర్ ఎలా చేయాలి? సింపుల్ స్టెప్స్​ ఇవిగో!

Mother Died After Hearing Son Died in Medak : లక్ష్మికి వెంటనే వైద్యం అందించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గంట వ్యవధిలోనే తల్లీకుమారుడు చనిపోవడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ గ్రామం అంతా విషాదఛాయలు అలుముకున్నాయి. నరసింహ గౌడ్​కు ప్రసన్న, కార్తీక్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తానని జిల్లా జాగృతి అధ్యక్షులు రమేశ్​ గౌడ్ హామీ ఇచ్చారు.

Person died Heart Attack at Railway Station
గంట వ్యవధిలోనే మరణించిన తల్లి కుమారుడు

స్కూల్​కు వెళ్తుండగా బాలికకు గుండెపోటు- పాఠశాల ఎదురుగానే మృతి

Person died Heart Attack at Railway Station : మరోవైపు ఓ ప్రయాణికుడు రైల్వే స్టేషన్​లో ఫ్లాట్​ఫారంపై గుండెపోటు(A Person Died Heart Attack in Railway Station)తో మరణించాడు. ఈ ఘటన మహబూబాబాద్​ రైల్వే స్టేషన్​లో జరిగింది. మహబూబాబాద్​లోని తెట్టెలపాడు గ్రామానికి చెందిన రాంబాబు (30) తన కుటుంబసభ్యులతో కలిసి మహబూబాబాద్ నుంచి హైదరాబాద్​కు గోల్కొండ ఎక్స్​ప్రెస్​లో వెళ్లేందుకు టికెట్ కొనుగోలు చేసి 2 నంబర్ ఫ్లాట్ ఫారంపై రైలు ఎక్కేందుకు నడుచుకుంటూ వస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ప్రయాణికులు వెంటనే సీపీఆర్ చేశారు. అయినా ఫలితం దక్కలేదు. మృతుడి భార్య నవ్య స్థానికుల సాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందాడని తెలిపారు. మృతుడికి ఇద్దరు కూమార్తెలు ఉన్నారు.

గుండెపోటు లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఇలా చేయండి!

Last Updated :Jan 6, 2024, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.