మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వారిద్దరినీ స్థానికులు నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
తీవ్రగాయాలైన మహ్మద్ జుబేర్ హుస్సేన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. కౌడిపల్లి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా