మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారును, సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంకటరావు, అబ్కారీశాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆయన వెంట ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్, సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ హాల్, మొదటి, రెండో అంతస్తులో నిర్మిస్తున్న జిల్లా అధికారుల గదులను ఆయన పరిశీలించారు.
జిల్లాలోని భూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సీఎస్ తనిఖీ చేశారు. పల్లె ప్రకృతి వనంలో ఆయన మొక్కలు నాటారు. ఆర ఎకరం స్థలంలో సుమారు 2 వేల పండ్ల, పూల మొక్కలను నాటడం జరిగిందని అధికారులు వివరించారు. పల్లె ప్రకృతి వనంలో పనులు బాగున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కొనియాడారు.
![cs somesh kumar inspection on collector building works in mahaboobnagar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10762992_1_pms.png)