ETV Bharat / state

కరోనాతో మృతి.. అంత్యక్రియలు జరిపిన గ్రామ సిబ్బంది

author img

By

Published : May 15, 2021, 7:18 AM IST

funerals
funerals

కరోనాతో ఓ మహిళ చనిపోయింది. అయితే కనీసం కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రాలేదు. దీనితో సర్పంచ్​ చొరవతో సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి.. అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన కుమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది.

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన పేద మహిళ కొద్దిరోజులుగా కొవిడ్​ సోకి బాధపడుతుంది. పరిస్థితి విషమించడంతో నిన్న ఉదయం మృతి చెందింది. కరోనా వల్ల చనిపోవడంతో.. బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఎవరూ రాలేదు. కనీసం కుటుంబ సభ్యులు సైతం మృతదేహాన్ని ముట్టుకునేందుకు సాహసించలేదు. దిక్కుతోచని స్థితిలో గ్రామ సర్పంచ్​కు సమాచారం అందించారు.

పంచాయతీ సర్పంచ్​ మెస్రం ఉమ చొరవ తీసుకుని పంచాయతీ సిబ్బందితో దహన సంస్కారాలు జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. సిబ్బందికి పీపీఈ కిట్లు ధరించి... అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి: అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.