ETV Bharat / state

CM KCR Asifabad Tour : 'ఆదివాసీల మీద ఉన్న పోడుభూముల కేసులన్నీ రద్దు చేస్తాం'

author img

By

Published : Jun 30, 2023, 3:33 PM IST

Updated : Jun 30, 2023, 5:12 PM IST

KCR
KCR

CM KCR Speech At Asifabad : రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్​ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్​ ఆసిఫాబాద్​లో పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్​ మాట్లాడారు.

CM KCR Distribution Podu Pattas in Asifabad : నేడు రాష్ట్రంలో లక్షన్నర మంది రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. ఈ పోడు పట్టాలను కూడా మహిళల పేరు మీదనే ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్​(టి) నియోజకవర్గంలోని ఆదివాసీలకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. వారికి పత్రాలను అందించారు. అనంతరం పోడు భూములు పొందిన ఆదివాసీలను ఉద్దేశించి ప్రసంగించారు.

రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాలు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని సీఎం కేసీఆర్​ అన్నారు. ఈ పోడు భూముల పట్టాల పంపిణీని రెండు, మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ పట్టాలను పురుషుల పేరు మీద కాకుండా.. మహిళల పేరు మీదనే ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలకు అండగా ఉండే ప్రభుత్వం బీఆర్​ఎస్ అని మరోసారి స్పష్టం చేశామని తెలిపారు. ఇప్పటివరకు ఆదివాసీల మీద ఉన్న పోడు భూముల కేసులు ఎత్తివేయాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. పోడు పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కేసులు ఉండటం సరికాదని సీఎం కేసీఆర్​ అన్నారు.

"పట్టాలు మహిళల పేరు మీద ఇవ్వడం జరిగింది. ఆదివాసీల మీద ఉన్న పోడు భూముల కేసులు ఎత్తివేయాలి. పట్టాలు ఇచ్చిన తర్వాత ఇంకా కేసులు ఉండటం సరికాదు. పోడు భూములకు 3 ఫేజ్‌ కరెంటు ఇస్తాం. గిరివికాసం పథకం కింద బోర్లు వేసుకునే అవకాశం ఇస్తాం." - కేసీఆర్‌, సీఎం

ఆదివాసీల మీద ఉన్న పోడుభూముల కేసులు ఎత్తివేయాలి

CM KCR Distribution Podu Lands : రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల మంది రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్​ తెలిపారు. పట్టాలు పొందిన ఆదివాసీ రైతులకు రూ.23.56 కోట్లు విలువ చేసే రైతుబంధు చెక్కులను అందించామని వివరించారు. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో.. పోడు పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. ఇక నుంచి ఈ భూములకు 3 ఫేజ్​ కరెంట్​ ఇవ్వాలని.. విద్యుత్​ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. పోడు భూముల్లో ఆదివాసీలు బోర్లు వేసుకునేందుకు గిరివికాసం పథకం కింద.. ప్రభుత్వం బోర్లను వేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్​తో పాటు మంత్రులు మహమూద్​ అలీ, ఇంద్రకరణ్​ రెడ్డి, సీఎస్​ శాంతి కుమారి, ఇంకా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అంతకు ముందు ఆసిఫాబాద్​కు చేరుకున్న సీఎం కేసీఆర్​.. మహమూద్​ అలీ, మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డిలతో కలిసి బీఆర్​ఎస్​ జిల్లా కార్యాలయాన్ని, జిల్లా పోలీస్​ కార్యాలయాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కుమురం భీం విగ్రహాన్ని సీఎం కేసీఆర్​ ఆవిష్కరించారు. ఎస్పీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్​ ప్రత్యేక పూజలు నిర్వహించి.. ప్రారంభించారు.

ఇవీ చదవండి :

Last Updated :Jun 30, 2023, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.