ETV Bharat / state

'ప్రజా సంఘాలను ఏకం చేసి భాజపా అంతు చూస్తాం'

author img

By

Published : Jan 25, 2021, 3:16 PM IST

భాజపా ప్రభుత్వం.. రాముడి పేరు చెప్పుకొని ప్రజలను మోసం చేస్తోందని రాష్ట్ర ప్రజా సంఘాల ఐకాస వ్వవస్థాపక అధ్యక్షులు గజ్జెల కాంతం ఆరోపించారు. మావోయిస్టు, కమ్యూనిస్టు పార్టీలకంటే భాజపా భయంకరమైందని ఆయన విమర్శించారు.

We will unite the public associations and see the end of the BJP says gajjela kantham
'ప్రజా సంఘాలను ఏకం చేసి భాజపా అంతు చూస్తాం'

రాష్ట్రంలోని ప్రజా సంఘాలన్నింటిని ఏకం చేసి భాజపా అంతు చూస్తామని రాష్ట్ర ప్రజా సంఘాల ఐకాస వ్వవస్థాపక అధ్యక్షులు గజ్జెల కాంతం పేర్కొన్నారు. కరీంనగర్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

భాజపా ప్రభుత్వం.. రాముడి పేరు చెప్పుకొని ప్రజలను మోసం చేస్తోందని కాంతం ఆరోపించారు. మావోయిస్టు, కమ్యూనిస్టు పార్టీల కంటే భాజపా భయంకరమైనదని విమర్శించారు.

భాజపా మోసాలపై అన్ని జిల్లాల్లోని ప్రజా సంఘాలను ఏకం చేసి.. అవగాహన కల్పిస్తామని కాంతం పేర్కొన్నారు. ఆ మేరకు.. మే, డిసెంబర్‌ నెలల్లో కరీంనగర్​లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: అయోధ్య రామమందిరానికి హైదరాబాదీ ముస్లిం భారీ విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.