ETV Bharat / state

గన్నేరువరం మండల వ్యాప్తంగా పల్స్​ పోలియో

author img

By

Published : Feb 1, 2021, 12:53 AM IST

puls polio in karimnagar district
గన్నేరువరం మండల వ్యాప్తంగా పల్స్​ పోలియో

పోలియో రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం పల్స్​ పోలియో కార్యక్రమం చేపడుతున్నారు. కరీంనగర్​ జిల్లా మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా పిల్లలకు చుక్కల మందు వేశారు. గన్నేరువరం మండలం పారువెల్లలో మండల సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు తీగల మోహన్​ రెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని మానకొండూరు, తిమ్మాపూర్, గన్నేరువరం, ఇల్లంతకుంట, బెజ్జంకి, శంకరపట్నం మండలాల్లో పల్స్​ పోలియో కార్యక్రమం చేపట్టారు. గన్నేరువరం మండలం పారువెల్లలో మండల సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు తీగల మోహన్​ రెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు చెక్కిళ్ల రవీందర్​ గౌడ్, ఆశా వర్కర్లు, అంగన్​వాడీ టీచర్లు పాల్గొన్నారు.

మండలంలో 2014 మంది పిల్లలకు గానూ 1954 చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు ప్రాథమిక వైద్య పర్యవేక్షకులు శ్రీనివాస్, రమేశ్​ తెలిపారు. మిగిలిన వారికి ఇంటికెళ్లి పోలియో చుక్కలను వేస్తామన్నారు.

ఇదీ చదవండి: 'రామాలయ నిర్మాణానికి కేసీఆర్ అనుకూలమా? కాదా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.