ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం..

author img

By

Published : Mar 4, 2020, 5:45 PM IST

a man suspicious dead in kamareddy
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం..

కామారెడ్డి జిల్లాలోని నవాబ్​వెంచర్​లో ఓ వ్యక్తిని దుండగులు బండరాయితో కొట్టి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి వివరాలు దర్యాప్తు చేపట్టారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నవాబ్ వెంచర్​లో గుర్తు తెలియని వ్యక్తిని అగంతుకులు బండరాయితో తలపై కొట్టి హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మృతుడు ఆంధ్రప్రదేశ్​కు చెందిన మేస్త్రిగా గుర్తించారు. వెంచర్ మొత్తం చెట్ల పొదలతో ఉండడం వల్ల ఎవరికి కనిపించకుండా లోపలికి తీసుకెళ్లి హత్య చేసుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం..

ఇవీ చూడండి: 'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.