ETV Bharat / state

సీఎం కేసీఆర్ పుట్టినరోజు కానుకగా.. అదిరిపోయే గిఫ్ట్​ ఇచ్చిన ఎంపీ సంతోష్​

author img

By

Published : Feb 16, 2023, 8:48 PM IST

MP Santhosh
MP Santhosh

Mp Santhosh to Adopt Kondagattu 1000 Acres Sanctuary: ముఖ్యమంత్రి కేసీఆర్​ను పుట్టినరోజును పురస్కరించుకుని ఎంపీ సంతోష్​కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండగట్టు అంజన్న సన్నిధి వెన్నంటి ఉండే 1000 ఎకరాలను దత్తత తీసుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు. మొదటి విడతగా కోటి రూపాయల వ్యయంతో అటవీ భూమికి మరింత పచ్చందాలు అద్దుతామని స్పష్టం చేశారు.

Mp Santhosh to Adopt Kondagattu 100 Acres Sanctuary: శ్రీరాముడికి నమ్మిన బంటు ఆంజనేయస్వామి స్వయంభుగా వెలసిన ప్రాంతం జగిత్యాల జిల్లా కొండగట్టు. సహజమైన కొండలు, గుట్టల మధ్య వెలసిన కొండగట్టును భారతదేశంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రంగా పునర్ నిర్మించాలని సీఎం కేసీఆర్‌ నిన్న అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయానికి మద్ధతుగా... కోట్లాది మంది ఆంజనేయ భక్తులకు బాసటగా కొండగట్టు సన్నిధి వెన్నంటి ఉండే వెయ్యి ఎకరాల అభయారణ్యం "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" తరఫున దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు.

సీఎం జన్మదిన కానుకగా ఈ నిర్ణయం : శుక్రవారం(ఫిబ్రవరి 17) సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ సంతోష్​కుమార్ వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్... స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత గత ఎనిమిదేళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఆంజనేయుడి ప్రధాన లక్షణాలైన పరాక్రమం, విశ్వాసం సీఎం కేసీఆర్ సొంతమన్న సంతోష్​.. అభివృద్ది నిర్ణయాల్లో పరాక్రమం, తెలంగాణ పట్ల ఆయన విశ్వాసం వెలకట్టలేనివని ఎంపీ గుర్తు చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సీఎం కాంక్షిస్తున్నారని... కాళేశ్వరం, యాదాద్రి పునర్ నిర్మాణం, ఇప్పుడు కొండగట్టు అంజన్న అభివృద్ధి నిర్ణయమైనా సీఎం కేసీఆర్​ దార్శనికతకు నిదర్శనమని తెలిపారు.

కోటి రూపాయల వ్యయంతో పనులు చేపడుతాం : కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే కంపార్ట్​మెంట్​ 684లో 752 ఎకరాలు, 685లో 342 ఎకరాలు మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకుంటున్నట్లు ఎంపీ సంతోష్​ కుమార్ ప్రకటించారు. మొదటి విడతగా కోటి రూపాయల వ్యయంతో ఈ 1000 ఎకరాల అటవీ భూమికి మరింత పచ్చందాలు అద్దుతామని స్పష్టం చేశారు. దశల వారిగా పనులు చేపడుతామన్నారు. చిన్నతనం నుంచే కేసీఆర్ వెంట ఉన్న తనకు కొండగట్టుతో బలమైన అనుబంధం ఉన్న దృష్ట్యా అనేక సార్లు ఆంజనేయుడిని దర్శించుకుని ఈ అటవీ ప్రాంతంలో సేదతీరిన అనుభూతులు ఉన్నాయని అన్నారు.

భక్తులు సేద తీరేలా పరిసరాలు తీర్చిదిద్దుతాం : 500 ఏళ్ల ముందే అస్థిత్వంలోకి వచ్చిన కొండగట్టు ఆలయంలో ఈ అడవిలో లభించే సుగంధ మొక్కలు, చందనం చెట్ల నుంచే అంజన్నకు పూజలు జరిగేవని ప్రతీతి. తిరిగి ఆ వైభవం తీసుకొస్తామన్నారు. అటవీశాఖ అధ్వర్యంలో అటవీ భూమి సరిహద్దుకు రక్షణ చర్యలతోపాటు, పునరుజ్జీవన చర్యలు సహా సహజ అడవి పునరుద్దరణకు చెక్ డ్యామ్‌ల నిర్మాణం, నేలలో తేమ పరిరక్షణ కార్యకలాపాలు చేపడతామన్నారు. కోతుల కోసం మంకీ ఫుడ్ కోర్ట్స్ నిర్మిస్తామన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు, పచ్చని ప్రకృతి మధ్య కాసేపు సేద తీరేలా పరిసరాలను తీర్చిదిద్ది... మట్టితో వాకింగ్ ట్రాక్​తో పాటు, పగోడాలను కూడా ఏర్పాటు చేస్తామని ఎంపీ సంతోష్‌కుమార్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.