ETV Bharat / state

YS Sharmila: 'TSPSC బోర్డు రద్దుకు రాష్ట్రపతికి.. గవర్నర్ సిఫార్సు చేయాలి'

author img

By

Published : Apr 19, 2023, 7:53 PM IST

YS Sharmila
YS Sharmila

YS Sharmila Letter to Governor Tamilisai: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు వైఎస్​ షర్మిల లేఖ రాశారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు రద్దుకు రాష్ట్రపతికి, గవర్నర్ సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నపత్రాలు విక్రయించి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు.

YS Sharmila Letter to Governor Tamilisai: ఆర్టికల్ 317 ప్రకారం టీఎస్​ఎస్సీ బోర్డు రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​ను.. వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే కొత్త బోర్డు వెంటనే ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. సంతలో సరుకులు అమ్మినట్లుగా కీలకమైన పరీక్షా పేపర్లు అమ్మారని ఆరోపించారు. ఫలితంగా 30లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడారని వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తంచేశారు.

టీఎస్​పీఎస్సీ పేపర్ లీకుల వెనుక బోర్డు చైర్మన్, సభ్యులు, ఉద్యోగుల నుంచి.. రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రుల వరకు హస్తం ఉందని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​కు ఆమె బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన.. పబ్లిక్ సర్వీస్​ కమిషన్​ పూర్తి విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించారు. పేపర్ లీకేజీపై రాష్ట్ర సర్కార్ నియమించిన సిట్ పనితీరు నమ్మశక్యంగా లేదని వైఎస్ షర్మిల అన్నారు.

సూత్రధారులను తప్పించే విధంగా దర్యాప్తు: ఈ కేసులో పాత్రధారులను మాత్రమే దోషులుగా తేలుస్తూ.. సూత్రధారులను తప్పించే విధంగా దర్యాప్తు సాగుతోందని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ క్రమంలోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 317 ప్రకారం టీఎస్​పీఎస్సీ రద్దు విషయమై రాష్ట్రపతికి సిఫారసు చేయాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం ప్రకారం ఈ నిర్ణయం తీసుకొనే బాధ్యత గవర్నర్​కి ఉందని గుర్తు చేశారు. 30 లక్షల మంది జీవితాలు.. మీ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నాయని వైఎస్ షర్మిల లేఖలో ప్రస్తావించారు.

అసలేం జరిగిదంటే: రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే వైఎస్​ షర్మిల కూడా స్పందించారు. నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు ప్రతిపక్ష పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే వివిధ పార్టీల అధ్యక్షులకు, నాయకులకు ఆమె లేఖలు రాశారు.

మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్​రెడ్డి సతీమణి విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు లోటస్​పాండ్​లోని ఆమె నివాసంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ షర్మిల కేక్‌ కట్‌ చేసి విజయమ్మకు తినిపించారు. అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: TSPSC Paper Leak : ఈడీ విచారణలో ప్రవీణ్ మౌనం.. నేనేం సంపాదించలేదన్న రాజశేఖర్

Kishan Reddy: 'సింగరేణి కార్మికుల కష్టాన్ని.. BRS నేతలు భక్షిస్తున్నారు'

'సాయం కోరుతూ అమిత్ షాకు మమత ఫోన్​!'.. రాజీనామా చేస్తానని దీదీ సవాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.