ETV Bharat / state

విచ్చేసిన లేటెస్ట్ విమానాలు.. ఘనంగా వింగ్స్ ఇండియా ఏవియేషన్‌ షో ప్రారంభం..

author img

By

Published : Mar 24, 2022, 3:24 PM IST

Updated : Mar 24, 2022, 3:36 PM IST

Wings India Aviation Show: హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా ఏవియేషన్‌ షో-2022 అట్టహాసంగా ప్రారంభమైంది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఫిక్కీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు బేగంపేట్ విమానాశ్రయంలో జరగనుంది.

Wings India Aviation Show
వింగ్స్ ఇండియా ఏవియేషన్‌ షో

Wings India Aviation Show: వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో-2022 అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో నాలుగు రోజుల పాటు జరగనుంది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మొదటిరోజు బీ2బీ మీటింగ్స్‌లో భాగంగా ఎయిర్‌బస్, ప్రాట్ అండ్ విట్నీ కంపెనీలు భారత విమానయాన రంగంతో తమ భాగస్వామ్యం, భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నారు.

రెండేళ్లు కఠిన సవాళ్లు

కరోనా వల్ల గడిచిన రెండేళ్లు పౌర విమానయాన రంగం కఠినమైన సవాళ్లు ఎదుర్కొందని విమానయాన రంగ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం మరల ఇంధన, ప్రాపంచిక ఒత్తిడి పరిస్థితులతో ఏవియేషన్ మార్కెట్ మరింత ప్రభావితమవుతోందని ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడ్డారు. భారత్ తమకు కీలక వ్యాపార భాగస్వామి అని .. రాబోయే ఇరవై ఏళ్లలో 2210 విమానాలను భారత్‌కు అందజేస్తామని ఎయిర్ బస్ ప్రకటించింది.

ప్రముఖ విమాన ఇంజిన్ల తయారీ కంపెనీ ప్రాట్ అండ్ విట్నీ ఈ ఏడాది ఏప్రిల్ కల్లా బెంగళూరులో తమ క్యాపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. వింగ్స్‌ ఇండియా ఏవియేషన్ షోలో భాగంగా ఎయిర్ బస్ 350 ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సందర్శకుల కోసం సారంగ్ టీమ్ చేసిన విన్యాసాలు అలరించాయి.

ప్రారంభించనున్న జ్యోతిరాదిత్య సింధియా

వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో-2022 ప్రదర్శనను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం ప్రారంభించనున్నారు. విమానయానరంగ భవిష్యత్తుపై 2 రోజులు రౌండ్ టేబుల్ సమావేశాలు జరగనున్నాయి. నేడు, రేపు పాలసీ తీర్మానాలపై చర్చలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:

Last Updated : Mar 24, 2022, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.