ETV Bharat / state

తెరాస ప్రభుత్వానికి రైతులే మొదటి ప్రాధాన్యం: కేటీఆర్

author img

By

Published : Dec 8, 2020, 9:20 AM IST

తమ ప్రభుత్వానికి రైతులే మొదటి ప్రాధాన్యమని మున్సిపల్​, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. రైతుల పట్ల సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి చిత్తశుద్ధికి అభినందనలు తెలుపుతూ ట్వీట్​ చేశారు.

we support farmers allways said minister ktr
ప్రభుత్వానికి రైతులే మొదటి ప్రాధాన్యం: మంత్రి కేటీఆర్

ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ రైతుబంధు అమలు చేస్తున్నామని మున్సిపల్​, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ చెప్పారు. తమ ప్రభుత్వానికి రైతులే మొదటి ప్రాధాన్యమని ట్వీట్​ చేశారు. రైతుల పట్ల సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి చిత్తశుద్ధికి అభినందనలు తెలిపారు.

ఈ నెల 27 నుంచి 58 లక్షలకు పైగా ఖాతాల్లో రైతుబంధు జమ చేస్తామన్నారు. రూ.7,300 కోట్లను రైతులకు అందిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు ఉసంహరించుకునే వరకు పోరాటం చేస్తామన్నారు.

ఇదీ చదవండి: ' కర్షకుల కష్టాన్ని కార్పొరేట్లకు కట్టబెడితే ఊరుకోం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.