ETV Bharat / state

Kishanreddy: దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

author img

By

Published : May 1, 2023, 7:42 AM IST

kishanreddy
kishanreddy

07:01 May 01

రాత్రి దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy admitted to Delhi AIIMS: కేంద్రమంత్రి పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్​రెడ్డి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దాంతో కుటుంబ సభ్యులు దిల్లీ ఎయిమ్స్​లో చేర్పించారు. గ్యాస్‌ సమస్య కారణంగా ఆదివారం రాత్రి దిల్లీ ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. కార్డియో న్యూరో సెంటర్‌లోని... కార్డియాక్‌ కేర్‌ యూనిట్‌లో కిషన్‌రెడ్డికి చికిత్స అందిస్తున్నారు. ఆయన్ను పరిశీలనలో ఉంచామని, ఇవాళ ఉదయం డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపినట్లు కిషన్‌రెడ్డి కార్యాలయ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఒక్కసారిగా కేంద్రమత్రి కిషన్​రెడ్డి అస్వస్థతకు గురికావడంతో బీజేపీ శ్రేణులు ఒకింత ఆందోళన చెందారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.