ETV Bharat / state

TSPSC Paper Leak Case : పేపర్​ లీకేజీ కేసులో AE 16వ ర్యాంకర్ అరెస్టు.. నెలాఖరులో మరో 30 మంది..!

author img

By

Published : Jul 10, 2023, 8:14 AM IST

TSPSC Paper Leakage
TSPSC Paper Leakage

TSPSC Paper Leak Case Update : టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్‌ అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సిట్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఏఈ పరీక్షలో 16వ ర్యాంక్ సాధించిన ఎం. నాగరాజు అనే యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెలాఖరు లోపు 30 మందిని పోలీసులు అరెస్ట్ చేయున్నట్లు సమాచారం.

TSPSC Paper Leakage Case Latest Update : టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్‌ అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురానికి చెందిన ఎం. నాగరాజు అనే యువకుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. గతంలో హైటెక్‌ మాస్ కాపీయింగ్​కు పాల్పడి అరెస్ట్ అయిన ఏఈ పోల రమేష్ నుంచి సేకరించిన సమాచారంతో పాటు సెల్‌ఫోన్​లోని కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్న సిట్... తాజాగా నాగరాజును అరెస్ట్ చేసింది.

SIT Investigation in TSPSC Paper Leak : మున్సిపల్ ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని పోల రమేష్ నుంచి కొనుగోలు చేసేందుకు నాగరాజు 30 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ముందుగా కొంత మొత్తాన్ని రమేష్​కు బదిలీ చేశాడు. అనంతరం పరీక్ష రాసిన నాగరాజు... 16వ ర్యాంకు సాధించాడు. దర్యాప్తులో భాగంగా నాగరాజు కోసం రామాపురం వెళ్లిన సిట్ అధికారులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్​కి తరలించారు. కాగా పోల రమేష్ ఇప్పటికే 7గురికి ఏఈఈ, డీఏవో పరీక్ష కోసం హైటెక్ పద్దతిలో మాస్‌ కాపీయింగ్ చేశాడు. పరీక్షా కేంద్రాల యాజమాన్యం, అధ్యాపకుల సహాకారంతో జవాబులను మైక్రో ఎలక్ట్రానిక్ డివైజ్​ల ద్వారా ఒప్పందం చేసుకున్న అభ్యర్దులకు అందించాడు. మరోవైపు ఏఈ ప్రశ్నాపత్రాలను విక్రయించాడు.

ఈ నెలాఖరు లోపు మరో 30 మంది అరెస్టు : టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ తన వద్దకు ఏఈ పేపర్ రాగానే దాన్ని విక్రయించాలని తన స్నేహితుడు సురేష్​కు చేప్పాడు. సురేష్​కు బంధువైన పోల రమేష్​కు ఈ విషయం చెప్పగా... తాను విక్రయస్తానని చెప్పి ప్రశ్నాపత్రాలను తీసుకున్నాడు. ఇదే క్రమంలో అభ్యర్ధిని బట్టి పోల రమేష్ డబ్బు గుంజాడు. గతంలోనే రమేష్ 30 మందికి పేపర్ విక్రయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అతని వద్ద నుంచి పేపర్‌ను కొనుగోలు చేసిన వారిని పోలీసులు ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ నెలాఖరు లోపు 30 మందిని పోలీసులు అరెస్ట్ చేయున్నట్లు సమాచారం.

TSPSC Paper Leakage Case : టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో ఇప్పటివరకు నాగరాజుతో కలిపి సిట్‌ అధికారులు 53 మందిని అరెస్టు చేశారు. అయితే అంతకు ముందు ఈ కేసుకు సంబంధించిన అభియోగపత్రాలలో.. దాదాపు 37 మంది నిందితుల పేర్లను చేర్చింది. దీని కోసం న్యాయనిపుణుల సలహా కూడా తీసుకున్నారు. అందులో న్యూజిలాండ్‌లో ఉంటున్న ప్రశాంత్‌రెడ్డి మినహా, మిగిలిన అందరిని సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.