ETV Bharat / state

TOP TEN NEWS: టాప్‌టెన్ న్యూస్@3PM

author img

By

Published : Feb 24, 2022, 3:01 PM IST

TOP TEN NEWS
TOP TEN NEWS

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

  • ఉక్రెయిన్​ యుద్ధంపై తెలుగు విద్యార్థిని ఏమన్నారంటే?!

Ukraine Crisis: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అక్కడి తెలుగు విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. తెలుగు విద్యార్థిని లక్ష్మీ శ్రీలేఖ ఈటీవీ భారత్​కు అక్కడి పరిస్థితులను వివరించారు.

  • భారతీయులూ జాగ్రత్త!

Russia Ukraine war India response: రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై భారత్ స్పందించింది. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్​లోని భారత పౌరుల సంక్షేమంపై దృష్టిసారించినట్లు తెలిపింది.

  • ఎలాగైనా యుద్ధాన్ని ఆపండి

Russia Ukraine News: ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఎలాగైనా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించాలని కోరారు ఉక్రెయిన్ రాయబారి. ఇప్పటికే సమయం మించిపోయిందన్నారు.

  • పదో తరగతి పరీక్షల్లో భారీ మార్పులు

AP SSC Exams : పదో తరగతి పరీక్షల్లో తీసుకొచ్చిన భారీ మార్పులతో ఈ ఏడాది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. రెండేళ్ల కిత్రమే పరీక్షల్లో మార్పులు తీసుకొచ్చినా.. కరోనా వల్ల పబ్లిక్‌ పరీక్షలు జరగలేదు. దీంతో సంస్కరణల పరీక్షలను... ఈ ఏడాది విద్యార్థులు ఎదుర్కోబోతున్నారు.

  • భద్రాద్రి రామయ్య కల్యాణానికి గోటి తలంబ్రాలు

Lord Rama of Bhadrachalam: వేయి పున్నముల శోభను కళ్లెదుట సాక్షాత్కరింపచేసే భద్రాద్రి రాములోరి కల్యాణం అద్వితీయం.. అపురూపం.. ఈ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులు తండోపంతాలుగా తరలివస్తారు... కానుకలు, నైవేద్యాలు సమర్పించుకుంటారు... కానీ ఆ సీతారాముల కల్యాణానికి కావాల్సిన తలంబ్రాలు సమర్పించే భాగ్యం మాత్రం కొందరికే దక్కుతుంది... ఈసారి కూడా ఆ అవకాశాన్ని శ్రీరఘురామ భక్త సమితే పొందింది.

  • బయో ఆసియా సదస్సు

KTR Inaugurates Bio Asia Summit 2022 : రెండు దశాబ్దాలుగా లైఫ్ సైన్సెస్ రంగ అభివృద్ధిలో బయో ఆసియా సదస్సు క్రియాశీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న 19వ ఎడిషన్ బయో ఆసియా అంతర్జాతీయ సదస్సును వర్చువల్‌గా ప్రారంభించారు.

  • వ్యవసాయానికి స్మార్ట్​ హంగులు

MODI ON SMART AGRICULTURE: వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా 2022-23 బడ్జెట్​లో సరికొత్త నిర్ణయాలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. గత ఏడేళ్లలో రైతులకు వ్యవసాయ రుణాలు 2.5 రెట్లు పెంచామని మోదీ చెప్పారు.

  • అజిత్​ 'వలిమై' రివ్యూ

తమిళ స్టార్​ హీరో అజిత్​ నటించిన 'వలిమై' సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తెలుగు యువ హీరో కార్తికేయ విలన్​గా నటించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుందా అనేది తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి..

  • పంజాబ్​ కింగ్స్​ కొత్త కెప్టెన్ అతడే​

Punjab kings Captain Mayank Agarwal: భారత బ్యాటర్​ మయాంక్ అగర్వాల్​ పంజాబ్​ కెప్టెన్​ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈ వారం చివర్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని క్రికెట్​ వర్గాలు తెలిపాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.