ETV Bharat / state

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ఏర్పాట్లపై సభాపతుల సమీక్ష

author img

By

Published : Feb 1, 2023, 8:04 PM IST

Telangana Budget Sessions 2023: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ఏర్పాట్లపై ఉభయసభల సభాపతులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై వారు చర్చించారు. శుక్రవారం ఈ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి.

Telangana Budget Sessions
Telangana Budget Sessions

Telangana Budget Sessions 2023: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం నుంచి సమావేశాలున్నందున ఇవాళ అసెంబ్లీలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివాదాలకు ఆస్కారం లేకుండా.. ఏర్పాట్లు చేయాలని స్పీకర్ చెప్పారు. కొన్నిసార్లు ఎమ్మెల్సీలకు తగిన ప్రొటోకాల్ ఉండటం లేదని గుత్తా సుఖేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇద్దరు ఎమ్మెల్సీలకు జరిగిన అవమానంపై తన కార్యదర్శి ద్వారా ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. కొన్నిసార్లు స్వయంగా తనకే అవమానం జరుగుతోందన్నారు. ఇక ముందు అలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సమావేశంలో శాసన వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, సీపీ సీవీ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

ఉభయసభలను ప్రొరోగ్‌ చేయకుండానే: ఉభయసభలను ప్రొరోగ్‌ చేయకుండానే.. గత సమావేశాలకు కొనసాగింపుగా బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించనున్నారు. ఎన్ని రోజులు జరపాలనేది శుక్రవారం సభ ముగిసిన అనంతరం బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలి బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్‌ తమిళిసై బడ్జెట్‌ సమావేశాల తొలిరోజున ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

రాజ్యాంగ బద్ధంగా బడ్జెట్‌ సమావేశాలు: హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వ, రాజ్‌భవన్‌ తరఫు న్యాయవాదుల మధ్య చర్చల అనంతరం రాజ్యాంగ బద్ధంగా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంతరెడ్డితోపాటు పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డితోపాటు కొందరు అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి బడ్జెట్‌ సమావేశాలపై గవర్నర్‌తో చర్చలు జరిపారు.

ఆ తర్వాతనే బడ్జెట్‌ సమావేశాల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. మరోవైపు.. గత శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన 8 బిల్లుల్లో 7గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన వివాదం సమసిపోయినందున.. బిల్లుల అంశానికి కూడా పరిష్కారం లభించనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: అందమైన మాటలు తప్ప.. కేటాయింపులు లేని డొల్ల బడ్జెట్‌: హరీశ్‌రావు

కేంద్ర బడ్జెట్.. తెలంగాణలోని సంస్థలకు ఇచ్చిన కేటాయింపులు ఇవే..!

'అమృతకాలపు బడ్జెట్.. నవ భారతానికి బలమైన పునాది'

Union Budget 2023 :​ అమృత కాలపు బడ్జెట్​.. నవభారతానికి బలమైన పునాది : మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.