తెలంగాణ ప్రభుత్వం గౌడ కులస్థుల కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరా పాలసీపై రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయంలో ఆబ్కారీ అధికారులతో నీరా విధానం గురించి సుదీర్ఘంగా చర్చించారు. నీరా సేకరణ, నిల్వ, మార్కెటింగ్తో పాటు నీరా కేఫ్ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తాటి, ఊత చెట్ల నుంచి తయారు చేసే నీరా... క్యాన్సర్ను అడ్డుకుంటుందని మద్రాస్ లేబరేటరీ ఇచ్చిన నివేదికలో వెల్లడైంది. ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్న వారి కోసమే నీరా పాలసీ తీసుకొస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
- ఇదీ చదవండి: 'భాజపాతో కుమ్మక్కు'పై కాంగ్రెస్లో రగడ