ETV Bharat / state

'చలో కావలి'లో ఉద్రిక్తత.. దేశం నేతలను అడ్డుకున్న పోలీసులు..

author img

By

Published : Jan 10, 2023, 5:06 PM IST

Police are blocking Chalo Kavali programme
చలో కావలి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న పోలీసులు

TENSION AT CHALO KAVALI PROGRAM : ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరులో దళితులపై వరుస దాడులను నిరసిస్తూ టీడీపీ చేపట్టిన చలో కావలి కార్యక్రమానికి పోలీసులు అడ్డుంకులు సృష్టిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులను వారి వారి ఇళ్లలోనే గృహ నిర్బంధించారు. దాంతో కావలిలో టెన్షన్​ వాతావరణం నెలకొంది.

TDP CHALO KAVALI : ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలో ఎస్సీలపై వరుస దాడులను నిరసిస్తూ తెలుగుదేశం చేపట్టిన చలో కావలి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులను ఇప్పటికే గృహ నిర్బంధం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్​ఛార్జ్ అబ్దుల్ అజీజ్, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్​ను ఇళ్లలోనే నిర్బంధించారు.

ఇంటి బయట డోలా బాల వీరాంజనేయస్వామి బైఠాయింపు: అనంతపురం నుంచి కారులో వస్తున్న టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజును వింజమూరు సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా కొండెపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిని గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆయన ఇంటి బయటే బైఠాయించి నిరసన తెలిపారు.

వైసీపీ వేధింపులతో పలువురు ఆత్మహత్య: ముసునూరు ప్రాంతానికి చెందిన కరుణాకర్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన చావుకు అధికార పార్టీ నేతలే కారణమని సూసైడ్ నోట్​లో ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు యువత అధ్యక్షుడు హర్ష .. వైసీపీ నేతల వేధింపులతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గతంలో పొదలకూరుకు చెందిన నారాయణ చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు. ఈ ఘటనలను నిరసిస్తూ.. తెలుగుదేశం చలో కావలి కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతున్న చలో కావలి కార్యక్రమాన్ని హాజరవుతున్న సీపీఎం, సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ మాలేపాటి సుబ్బనాయుడును అరెస్ట్ చేసి జలదంకి స్టేషన్​కి తరలించారు.

చలో కావలి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న పోలీసులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.