ETV Bharat / state

అన్నదాతలకు శుభవార్త - రైతుబంధు పంపిణీకి డేట్​ ఫిక్స్​, ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 9:22 AM IST

Updated : Nov 26, 2023, 10:32 AM IST

Telangana Rythu Bandhu 2023
Telangana Rythu Bandhu 2023

Rythu Bandhu Funds Release on November 28 : రైతుబంధు చెల్లింపుల కోసం.. తెలంగాణ సర్కార్‌ ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. యాసంగి పెట్టుబడి సాయం అన్నదాతలకు అందించేందుకు.. శుక్రవారమే సీఈసీ అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం.. ఇవాళ, రేపు బ్యాంకులకు సెలవు కావడంతో.. మంగళవారం నుంచి అన్నదాతల ఖాతాల్లో నగదు జమ చేయనుంది.

Rythu Bandhu Funds Release on November 28 : రైతుబంధు చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం రైతులకు అందించేందుకు.. కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం అనుమతించింది. దీంతో తెలంగాణ సర్కార్‌.. చెల్లింపుల కోసం ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇందుకోసం రూ.7500 కోట్ల నిధులు చెల్లించేందుకు.. ఆర్థికశాఖ శుక్రవారమే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అందుకు అనుగుణంగా అన్నదాతలకు చెల్లింపులు చేయాల్సి ఉంది.

Telangana Rythu Bandhu Funds 2023 : రైతుబంధు నిధుల విడుదల​.. రైతుల ఖాతాల్లో జమ

ఇవాళ, రేపు కూడా బ్యాంకులకు సెలవు ఉన్న నేపథ్యంలో.. మంగళవారం చెల్లింపులు చేయనున్నారు. ఈ మేరకు రైతుల ఖాతాలో నగదు జమ చేస్తారు. వ్యవసాయ శాఖ బిల్లులు సిద్ధం చేస్తే దాని ప్రకారం.. అన్నదాతల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. వీలైనంత ఎక్కువ మందికి రైతుబంధు (Rythu Bandhu) సాయం అందించాలన్న ఆలోచనలో.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సమీకరించుకున్న నిధుల ఆధారంగా రైతుబంధు చెల్లింపులు జరగనున్నాయి.

CEC Approves Disubursal for Rythu Bandhu in Telangana : తెలంగాణలో యాసంగి సీజన్‌ కోసం రైతుబంధు (Telangana Rythu Bandhu 2023) పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి.. సీఈసీ శుక్రవారం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 28 వరకు చెల్లింపులు చేపట్టాలని స్పష్టం చేసింది. 2018 అక్టోబరు 5న సీఈసీ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని నిర్దేశించింది. ఏటా రాష్ట్ర సర్కార్ పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.5,000 ల చొప్పున.. రెండు సీజన్‌లకు మొత్తం రూ.10,000 లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.

ECI Approve Distribution of Rythu Bandhu : తెలంగాణలో వానాకాలంతో పాటు యాసంగి సీజన్‌ ఆరంభానికి ముందు.. రాష్ట్ర సర్కార్‌ రైతుబంధు నిధులు విడుదల చేస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కోడ్‌ అమల్లోకి రావడంతో.. తెలంగాణ ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్‌కు నిధుల జమ జరగలేదు. ఇది కొనసాగుతున్న పథకమని కోడ్‌ వర్తించదని.. యథావిధిగా ఈ సాయం విడుదలకు అనుమతించాలని ప్రభుత్వం.. గత నెలలో ఈసీని కోరుతూ లేఖ రాసింది. దీనిని పరిశీలించిన సీఈసీ తాజాగా నిధుల జమకు అనుమతులు ఇచ్చింది. ఈనెల 28 సాయంత్రానికి ప్రచార గడువు ముగుస్తుండగా.. అప్పటి నుంచి ఈ నెల 30న పోలింగ్‌ ముగిసే వరకు నిధులను జమ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Rythu Bandhu Funds Releasing Today : నేటి నుంచి కర్షకుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ

మంత్రి కేటీఆర్‌ హర్షం : రైతుబంధు(Rythu Bandhu) సాయం విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించడంపై బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (Minister KTR) సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగుల కరవుభత్యం (డీఏ) విడుదలకు కూడా అనుమతించాలని ఆయన కోరారు.

'రైతు బంధుని కాపీ కొట్టి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు'

రైతు బంధు సంబురం.. కూరగాయలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రం

Last Updated :Nov 26, 2023, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.