ETV Bharat / state

Revanth Reddy Warning To Party Activists : నిబంధనలు ఉల్లంఘిస్తే సస్పెండే.. కార్యకర్తలకు రేవంత్​ హెచ్చరిక

author img

By

Published : Jul 15, 2023, 3:32 PM IST

Revanth Reddy Serious On Party Activists Protesting : కాంగ్రెస్​లో మండల పార్టీ అధ్యక్ష నియామకాలు అంతర్గతంగా విభేదాలను సృష్టిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి ఇదే విషయమై అనేక నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలు.. గాంధీభవన్​లో నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి స్పందించారు.

Revanth Reddy
Revanth Reddy

Revanth Reddy Serious About Aleru Constituency Party activists : గాంధీభవన్​లో ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని పార్టీ నాయకులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు నాయకులు అక్కడ ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. నేడు కూడా రేవంత్​ రెడ్డి గాంధీభవన్​కు వచ్చేసరికి ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన కొందరు ఆందోళన చేస్తూ.. ఆయన కంటికి కనిపించారు. దీంతో నిరసనలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు.. వారిపై తీవ్రంగా స్పందించారు.

ఆందోళన చేస్తున్న కాంగ్రెస్​ కార్యకర్తలకు వివరణ ఇస్తూ.. ఆలేరు నియోజకవర్గంలో 8 ఉండగా.. అందులో 7 ఆ నియోజకవర్గ ఇంఛార్జి బీర్ల ఐలయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు చెప్పిన వాళ్లకే ఇచ్చామని రేవంత్​ రెడ్డి తెలిపారు. మిగిలిన ఒక్క మండలం మహిళకు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే ఆందోళన విరమించకుంటే సస్పెండ్​ చేసేందుకు వివరాలు సేకరించాలని గాంధీభవన్​ ఇంఛార్జి, పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్​ రావుకు ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే సస్పెండ్​నే : తుర్కపల్లి మండల నేతలు వెంటనే ధర్నా ఆపేయాలని నియోజవర్గ ఇంఛార్జి బీర్ల ఐలయ్యకు రేవంత్​ రెడ్డి హెచ్చరించారు. మరోవైపు గాంధీభవన్​ మెట్లపై ధర్నా చేసే వారి వివరాలు సేకరించాలని పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్​ రావును పీసీసీ ఆదేశించింది. మొన్నటివరకు మండల కమిటీ ప్రెసిడెంట్​గా ఉన్న శంకర్​ నాయక్​ను సస్పెండ్​ చేయాలని రేవండ్​ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తప్పవని.. వెంటనే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమ శిక్షణ కమిటీ అధ్యక్షుడు చిన్నారెడ్డికి సూచించారు.

Revanth Reddy Fires On Congress Aleru Constituency : కమిటీల నియామకంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. పార్టీ ఆర్గనైసింగ్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​, వేమ నరేందర్​ రెడ్డిలకు వినతి పత్రం ఇవ్వాలని రేవంత్​ స్పష్టం చేశారు. ఆ వినతులపై పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ఇదే విషయాన్ని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్​ చౌదరికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి తెలియజేశారు.

మునుగోడు, భువనగిరిలో మొదలైన సమస్య : కాంగ్రెస్​లో మండల కమిటీల నియామకాలు పార్టీలో కాకపుట్టించాయి. గత వారం చిన్నగా మొదలైన లొల్లి.. ఇప్పుడు తీవ్రసమస్యగా మారింది. మునుగోడు, భువనగిరి నియోజవర్గాలతో షురూ ఐనా సమస్య.. గజ్వేల్​, ఖానాపూర్​, ఖమ్మం, రామగుండ, ఎల్బీనగర్​, ఇబ్రహీంపట్నం, వరంగల్​ ఈస్ట్​, వరంగల్​ వెస్ట్​, మహేశ్వరం, కల్వకుర్తి, ఆలేరు, కోదాడ, సిద్దిపేట, నారాయణఖేడ్​, జనగామ, పాలకుర్తి, ఎల్లారెడ్డి, ముషీరాబాద్​ నియోజకవర్గాల్లో పెను దుమారమే సృష్టించింది. ఈ నియోజకవర్గాల నాయకులు.. గాంధీభవన్​కు వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.