ETV Bharat / state

'పేదలను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకురావాలి'

author img

By

Published : Apr 18, 2020, 8:31 PM IST

REAL ESTATE BUSINESS MAN DISTRIBUTED FOOD TO LABOURS
'పేదలను ఆదుకునేందుకు ప్రతీఒక్కరు ముందుకురావాలి'

హైదరాబాద్​ తార్నాకలోని అడ్డా కూలీలు, మహిళా సంఘాలకు రియల్ఎస్టేట్​​ వ్యాపారి రవీందర్​రెడ్డి బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేదలను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని రవీందర్​ కోరారు.

రాష్ట్రంలో లాక్​డౌన్ వేళ పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరముందని రియల్ ఎస్టేట్ వ్యాపారి రవీందర్ రెడ్డి సూచించారు. పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో హైదరాబాద్​ తార్నాకలోని అడ్డా కూలీలు, మహిళా సంఘాలకు తనవంతు సాయంగా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి లాలాగూడ సీఐ శ్రీనివాస్ పాల్గొని పేదలకు బియ్యం, కందిపప్పు, నూనె, నిత్యావసర సరుకులు అందజేశారు. సీఎం కేసీఆర్​ పిలుపు మేరకు పేద ప్రజలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. మానవతా దృక్పథంతో పేద ప్రజలను ఆదుకుంటున్న రవీందర్ రెడ్డిని పోలీసులు అభినందించారు. వైరస్ నిర్మూలన కొరకు ప్రభుత్వం సూచించిన నియమాలను పాటించి ప్రతి ఒక్కరు సహకరించాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.