ETV Bharat / state

Narendra Modi Warangal Tour : చారిత్రక నగరి ఓరుగల్లులో నేడు ప్రధాని మోదీ పర్యటన

author img

By

Published : Jul 7, 2023, 7:42 PM IST

Updated : Jul 8, 2023, 7:51 AM IST

PM Modi Visit to Warangal Today : చారిత్రక నగరి ఓరుగల్లులో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పర్యటించనున్నారు. రూ.6,109 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ప్రతిష్ఠాత్మక వ్యాగన్ తయారీ పరిశ్రమ సహా పలు జాతీయ రహదారులకు భూమిపూజ చేస్తారు. వరంగల్‌లో జరిగే విజయ్​ సంకల్పసభలో పాల్గొంటారు. మోదీకి ఘనస్వాగతం పలికేందుకు కాషాయదళ నేతలు సన్నద్ధమయ్యారు.

Narendra Modi Warangal Tour
Narendra Modi Warangal Tour

చారిత్రక నగరి ఓరుగల్లులో నేడు ప్రధాని మోదీ పర్యటన

PM Modi Public Meeting In Warangal : ఓరుగల్లులో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సర్వం సిద్ధమైంది. మూడు దశాబ్దాల తరవాత మరోసారి ప్రధాని ఏకశిలానగరానికి వస్తున్నారు. వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేటకు 9 గంటల 25 నిమిషాలకు మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 10 గంటల 15 నిమిషాలకు వరంగల్‌లోని మామునూరు ఏరోడ్రమ్‌కు చేరుకుంటారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని మోదీ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.

PM Modi Visits Telangana : 11 గంటల 40 నిమిషాలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుని.. వర్చువల్ విధానంలో రూ.521 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కాజీపేట వ్యాగన్ తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. రూ.2 ,147 కోట్ల వ్యయంతో.. జగిత్యాల-కరీంనగర్‌-వరంగల్ ఇంటర్ కారిడార్‌కు, రూ.3,441 కోట్ల వ్యయంతో ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మైదానంలో విజయ్ సంకల్ప బహిరంగసభలో పాల్గొంటారు.

Warangal PM Modi Public Meeting Today : మోదీ పర్యటన కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అధికారిక కార్యక్రమాలు, బహిరంగ సభకు వేర్వేరు వేదికలను ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, నితిన్ గడ్కరీ, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్​తో పాటు ముఖ్య నేతలంతా సభకు హాజరవుతున్నారు. మోదీ పర్యటన ఓ చారిత్రాత్మక ఘట్టమని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​రెడ్డి అభివర్ణించారు.

Narendra Modi Warangal Public Meeting Today : తొలిసారిగా ఓరుగల్లుకు వస్తున్న ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు.. కమలం సేన సర్వ సన్నద్ధమైంది. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ఆ పార్టీ.. సన్నాహక సమావేశాలు నిర్వహించి.. శ్రేణులను సమాయత్తం చేసింది. నగరంలో మోదీకి స్వాగతం పలుకుతూ.. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

"వరంగల్​ బహిరంగ సభ ద్వారా కల్వకుంట్ల కుటుంబానికి చరమగీతం పాడేందుకు మోదీ.. ప్రజల ఆశీర్వాదం కోరతారు. ఇవాళ సోషల్​ మీడియాలో బీజేపీపై విషప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏ రోజూ కూడా బీఆర్​ఎస్​తో గానీ.. కాంగ్రెస్​తో గానీ కలవదు. రేపు జరిగే సభకు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను".- కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రధాని రాకతో పోలీసుల పటిష్ఠ బందోబస్తు : ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అడగడుగున్న తనిఖీలను విస్తృతం చేశారు. ఎస్​పీజీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, సివిల్ పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటించే మార్గాల్లో మూడంచెల భద్రతను కల్పించారు. స్థానిక పోలీసులతో పాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చిన దాదాపు మూడున్నర వేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. 29 వాహనాలతో భారీ కాన్వాయ్ సిద్ధం చేశారు. అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు అదనంగా ఉంటాయి.

20 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్‌.. సీపీ ఉత్తర్వులు జారీ : వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీల పరిధిలో 20 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఓరుగల్లు పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ.. మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాలకు మామునూరు నుంచి సికింద్రాబాద్‌ హకీంపేట్‌కు వెళ్తారు. అక్కడి నుంచి రాజస్థాన్‌ బయలుదేరి వెళ్లనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 8, 2023, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.