ETV Bharat / state

MP Laxman on PM Modi Tour : 'సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనాలి'

author img

By

Published : Jul 7, 2023, 4:24 PM IST

MP Laxman comments on Narendra Modi Warangal tour : ఓబీసీ సమాజాన్ని దూషిస్తే చట్టం ఎవరికీ అతీతం కాదని గుజరాత్ హైకోర్టు తీర్పు వల్ల స్పష్టం అయిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. ఆ తీర్పు రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటి తీర్పు అని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ వరంగల్​ పర్యటన గురించి వివరించారు. బెంగాల్, తమిళనాడు, ఏపీ, కేరళ లాంటి రాష్ట్రాల్లో ప్రధాని వస్తే ప్రొటోకాల్​ పాటిస్తారని.. తెలంగాణ వస్తే కేసీఆర్​ మొహం చాటేస్తారని విమర్శించారు.

MP Laxman fires on KCR
MP Laxman fires on KCR

MP Laxman comments on Narendra Modi Warangal tour : ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ మొహం చాటేస్తున్నారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్​ విమర్శించారు. బెంగాల్, తమిళనాడు, ఏపీలో ప్రధాని వస్తే ప్రొటోకాల్​ పాటిస్తారని.. తెలంగాణలో మాత్రం అలా ఉండదని ఆయన ఆరోపించారు. చివరికు కేరళ లాంటి కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రంలోనూ ప్రొటోకాల్ పాటిస్తూ అభివృద్ధిలో పాలు పంచుకుంటే.. కేసీఆర్​ అభివృద్ధికి దూరంగా ఉంటున్నారని దుయ్యబట్టారు.

హైదరాబాద్​లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్​పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. సమతామూర్తి విగ్రహం, ఇక్రిశాట్, సికింద్రాబాద్ రైల్వే అభివృద్ధి పనులు, ఐఎస్బీ స్నాతకోత్సవం, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునఃప్రారంభం, నీతి అయోగ్ సమావేశానికి కూడా సీఎం కేసీఆర్​ హాజరు కాలేదని లక్ష్మణ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు ఎన్ని ఉన్నా.. ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. శనివారం ప్రధాని మోదీ వరంగల్​ పర్యటనలో కేసీఆర్​ పాల్గొనాలని ఆయన కోరారు.

Narendra Modi Warangal Tour : ఈ సందర్భంగా ప్రధాని మోదీ వరంగల్​ పర్యటన వివరాలను వివరించారు. పర్యటనలో భాగంగా రూ.6 వేల 100 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. కాజీగూడ రైల్వే వాగన్​ ప్రాజెక్టు, జాతీయ రహదారుల విస్తరణ పనులకు శ్రీకారం చుడతారని పేర్కొన్నారు. అలాగే కార్యక్రమం అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఆ సభకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

MP Laxman on Rahul Gandhi defamation case : మరోవైపు.. ఓబీసీ సమాజాన్ని దూషిస్తే చట్టం ఎవరికీ అతీతం కాదని గుజరాత్ హైకోర్టు తీర్పు వల్ల స్పష్టం అయ్యిందని ఎంపీ లక్ష్మణ్​ అన్నారు. ఆ తీర్పు రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటి తీర్పు అన్నారు. ఒక సామాజిక వర్గాన్ని దూషించడం నేరమని లక్ష్మణ్​ అభిప్రాయం వ్యక్తం చేశారు.

"ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ మొహం చాటేస్తున్నారు. బెంగాల్, తమిళనాడు, ఏపీ, చివరికు కేరళ రాష్ట్రంలో కూడా ప్రొటోకాల్​ పాటిస్తారు. తెలంగాణలో మాత్రం ప్రొటోకాల్​ పాటించరు. కేసీఆర్​ అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు. రాజకీయాలు ఎన్ని ఉన్నా ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదు. ఓబీసీ సమాజాన్ని దూషిస్తే చట్టం ఎవరికీ అతీతం కాదని గుజరాత్ హైకోర్టు తీర్పు వలన స్పష్టమైంది. ఆ తీర్పు రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటి తీర్పు" - లక్ష్మణ్​, రాజ్యసభ సభ్యుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.