ETV Bharat / state

అన్నార్తుల ఆకలి తీరుస్తున్న ఎమ్మెల్యే సాయన్న

author img

By

Published : May 19, 2021, 12:33 PM IST

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కరవైన నిరుపేదలు, వలస కూలీలు ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో భోజన సదుపాయాన్ని కల్పించినట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. దాతలు ముందుకు రావాలని కోరారు.

mla sayanna food distribution, akshayapatra foundation
ఎమ్మెల్యే సాయన్న భోజన సదుపాయం, అక్షయపాత్ర ఫౌండేషన్

సికింద్రాబాద్ ప్రజలు ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. లాక్​డౌన్​తో ఉపాధి కరవైన వలస కూలీలు, నిరుపేదలను ఆదుకోవాలని ఆయన కోరారు. అన్నార్తుల కోసం భోజన సదుపాయం ఏర్పాటు చేసి ఆకలి తీరుస్తున్నామని చెప్పారు.

బోయిన్​పల్లి మార్కెట్ ఛైర్మన్ టి.ఎన్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో 7 వ వార్డులోని గాంధీనగర్, తిరుమలగిరి, 2వ వార్డు అర్జున్ నగర్​లో ఈ సదుపాయం కల్పించారు.

ఇదీ చదవండి: కొవిడ్‌ నయమైనా జాగ్రత్తలు తప్పనిసరి.. లేకుంటే ముప్పె!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.