సికింద్రాబాద్ ప్రజలు ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. లాక్డౌన్తో ఉపాధి కరవైన వలస కూలీలు, నిరుపేదలను ఆదుకోవాలని ఆయన కోరారు. అన్నార్తుల కోసం భోజన సదుపాయం ఏర్పాటు చేసి ఆకలి తీరుస్తున్నామని చెప్పారు.
బోయిన్పల్లి మార్కెట్ ఛైర్మన్ టి.ఎన్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో 7 వ వార్డులోని గాంధీనగర్, తిరుమలగిరి, 2వ వార్డు అర్జున్ నగర్లో ఈ సదుపాయం కల్పించారు.
ఇదీ చదవండి: కొవిడ్ నయమైనా జాగ్రత్తలు తప్పనిసరి.. లేకుంటే ముప్పె!