ETV Bharat / state

రాష్ట్రంలో అవినీతి యథేచ్ఛగా కొనసాగుతోంది: రాజాసింగ్​

author img

By

Published : Jun 7, 2020, 10:31 PM IST

mla-rajasingh-speak-on-land-mafia-in-hyderabad-telanngana
రాష్ట్రంలో అవినీతి యథేచ్చగా కొనసాగుతోంది: రాజాసింగ్​

గోషామహల్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. అవినీతి రహిత రాష్ట్రంమని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ కబ్జాలను అరికట్టాలని సవాల్​ విసిరారు రాజాసింగ్.

రాష్ట్రంలో అవినీతి యథేచ్ఛగా కొనసాగుతోందని... అవినీతి రహిత తెలంగాణగా తీర్చిదిద్దే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. బంజారాహిల్స్​ భూ వివాదం విషయంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన రెవెన్యూ, పోలీస్​ అధికారులు చిక్కారు. ఈ తీరుతో ప్రభుత్వం అవినీతిమయంగా మారినట్లనిపిస్తోందని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో అవినీతి యథేచ్చగా కొనసాగుతోంది: రాజాసింగ్​

రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ భూముల అక్రమణ, భూ దందాలు ఇష్టారీతిగా సాగుతున్నాయి. నకిలీ పత్రాలు సృష్టిస్తూ.. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తోన్న కబ్జాదారులకు... అధికారులు సహకరిస్తున్నారు. గోషామహల్​ నియోజకవర్గ పరిధిలో రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ విషయంలో పలుమార్లు అసెంబ్లీ, కలెక్టర్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు.

- ఎమ్మెల్యే రాజాసింగ్

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.