ETV Bharat / state

విద్యుత్తు ఛార్జీల పెంపుపై కసరత్తు!

author img

By

Published : Jan 30, 2020, 8:54 AM IST

Updated : Jan 30, 2020, 9:06 AM IST

MINISTER JAGADEESHWAR REDDY REVIEW MEETING ON POWER
MINISTER JAGADEESHWAR REDDY REVIEW MEETING ON POWER

హైదరాబాద్​లోని ఎస్పీడీసీఎల్​ కార్యాలయంలో అధికారులతో మంత్రి జగదీశ్​రెడ్డి సమీక్షాసమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న విద్యుత్​ డిమాండ్​కి అనుగుణంగా... సరఫరాలో ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ నానాటికి పెరిగి పోతుందని మంత్రి జగదీశ్​ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని ఎస్పీడీసీఎల్​ కార్యాలయంలోని తన ఛాంబర్​లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ట్రాన్స్​కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్​ సీఎండీ రఘుమారెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ సరఫరాలో అంతరాయం కలుగకుండా అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

గతేడాది ఆగస్టు 30 నాటికి గరిష్ఠంగా 11,703 మెగావాట్ల డిమాండ్ నమోదైందని జగదీశ్​రెడ్డి తెలిపారు. ప్రస్తుత సీజన్​లో ఇప్పటి వరకు 11,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందన్నారు. 13,000 మెగావాట్లకు విద్యుత్​ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున సాంకేతికంగా ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా చూడాలని మంత్రి కోరారు.

విద్యుత్తు ఛార్జీల పెంపుపై కసరత్తు!

ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం

Last Updated :Jan 30, 2020, 9:06 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.