ETV Bharat / state

'ఆర్​బీఐ అనుమతిస్తేనే.. అప్పు ఇస్తాం'

author img

By

Published : May 19, 2022, 8:34 AM IST

''డబుల్​' ఇ​ళ్లను పూర్తి చేసేందుకు మరో రూ.2వేల కోట్ల రుణం ఇవ్వండి'
''డబుల్​' ఇ​ళ్లను పూర్తి చేసేందుకు మరో రూ.2వేల కోట్ల రుణం ఇవ్వండి'

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను పూర్తి చేసేందుకు మరో రూ.2 వేల కోట్ల రుణం ఇవ్వాలని తెలంగాణ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ‘హడ్కో’ని కోరింది. ఇదే విషయమై హడ్కో అధికారులను కలిసేందుకు రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ సునీల్‌శర్మ ఈ నెల 23న దిల్లీకి వెళ్లనున్నారు.

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను పూర్తి చేసేందుకు తెలంగాణ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మరో రూ.2 వేల కోట్ల రుణం ఇవ్వాలని ‘హడ్కో’ని కోరింది. ఈ పథకానికి ఇప్పటికే హడ్కో (హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) రూ.8 వేల కోట్ల రుణం ఇచ్చింది. రాష్ట్రాలు కార్పొరేషన్ల పేరుతో తీసుకుంటున్న రుణాలను సైతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో లెక్కిస్తామని కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధన తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త అప్పు మంజూరుపై హడ్కో.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)ని సంప్రదించింది. దీంతో ఇప్పుడు ఆర్‌బీఐ స్పందన కీలకం కానుంది. హడ్కో అధికారులను కలిసేందుకు రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ సునీల్‌శర్మ ఈ నెల 23న దిల్లీకి వెళుతున్నారు.

బడ్జెట్‌లో రూ.11 వేల కోట్ల ప్రతిపాదన.. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,91,057 గృహాలు మంజూరు చేసింది. వీటిలో దాదాపు 15వేల ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చారు. ఈ ఏడాది బడ్జెట్‌లో నిర్మాణంలో ఉన్న ఇళ్లతో పాటు సొంత జాగా ఉన్న వారికి రూ.3 లక్షల సాయం కలిపి రూ.11 వేల కోట్లు ప్రతిపాదించింది.

ఇవీ చూడండి..

నాలుగు విడతల్లో రూ.3 లక్షలు.. సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం

ఈ నెల 26న హైదరాబాద్​కు ప్రధాని మోదీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.