ETV Bharat / state

గణనాథుల నిమజ్జనాలతో ట్యాంక్​బండ్​ వద్ద సందడి

author img

By

Published : Sep 1, 2020, 11:21 AM IST

ganesh immersion at Tank Bund, Hyderabad
గణనాథుల నిమజ్జనాలతో ట్యాంక్​బండ్​ వద్ద సందడి

హైదరాబాద్​లోని ట్యాంక్​ బండ్​ వద్ద సందడి నెలకొంది. గణనాథులను నిమజ్జనం చేసేందుకు చాలా మంది వస్తున్నారు. దీనితో ట్రాఫిక్​ అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

గణనాథుల నిమజ్జనాలతో ట్యాంక్​బండ్​ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ట్రాఫిక్​కు అంతరాయ కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గణపతి బొప్పా మోరియా అంటూ... ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలు మార్మోగాయి.

అందంగా అలంకరించిన వాహనాల్లో శోభాయమానంగా వినాయకులను హుస్సేన్ సాగర్​లో నిమజ్జనానికి... భక్తులు తీసుకొస్తున్నారు. గతంలో పెద్ద పెద్ద విగ్రహాలతో భారీ ఊరేగింపుతో వచ్చేవారు. ఈసారి కొవిడ్​ నేపథ్యంలో చిన్న చిన్న విగ్రహాలను... అందంగా ముస్తాబు చేసి నిమజ్జనానికి తీసుకొస్తున్నారు.

గణనాథుల నిమజ్జనాలతో ట్యాంక్​బండ్​ వద్ద సందడి

ఇదీ చదవండి- హద్దు మీరిన చైనా- గట్టిగా బదులిచ్చిన భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.